ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తుందా..!?

పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదలయింది. విపక్షాలన్నీ ఎన్నికలకు సిద్ధమంటున్నాయి. కానీ వైసీపీ మాత్రం.. ఎన్నికలు వద్దే వద్దని అంటోంది. ప్రభుత్వం కూడా అదే చెబుతోంది. ప్రభుత్వం అసలు ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనే పెట్టుకోకుండా… ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ప్రభావితం చేసి.. ఎన్నికలకు దూరంగా పెట్టాలని నిర్ణయించింది. ఇప్పుడు పరిస్థితి ఎటు తిరిగి ఎటు వెళ్తుందో చెప్పడం కష్టమవుతోంది. చివరికి సుప్రీంకోర్టులోనే ఏదో ఒకటి తేలాల్సి ఉంది. ఇరవై ఐదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. అధికారులు స్వీకరిస్తారో లేదో క్లారిటీ లేదు. సుప్రీంకోర్టులో ఆ రోజున పిటిషన్ విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకూ సహకరించాల్సిన అధికారులు సహకరించే పరిస్థితి లేదు.

అయితే విపక్ష పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు చేసుకున్నాయి. స్థానిక నేతలు… తమ తమ అభ్యర్థుల్ని ఖరారు చేసుకున్నాయి. నామినేషన్ పేపర్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికలు… పార్టీల ప్రకారం జరగవు. పార్టీ గుర్తుల ఆధారంగా జరగవు. ఆయా పార్టీల మద్దతుదారులన్నట్లుగానే జరుగుతాయి. అందుకే… నేతలు స్థానికంగా తమ పార్టీ మద్దతుదారులను బరిలో నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ తరహా ప్రయత్నాలను వైసీపీ నేతలు కూడా చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి.. సుప్రీంకోర్టులోనూ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు రాదన్న చర్చ బలంగా ఉంది. ఇలాంటి సమయంలో వైసీపీ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. కానీ హైకమాండ్ నుంచి ఎలాంటి సూచనలు అందడం లేదు.

దీంతో కొంత మంది స్థానిక నేతలు.. చొరవ తీసుకుని సర్పంచ్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఎటూ తేలకపోతే… వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలకు పూర్తి వ్యతిరేకం కాబట్టి… ఎన్నికలు బహిష్కరిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అలా జరిగితే.. స్వీయ శిక్ష విధించుకుంటున్నట్లు అవుతుందన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో ఉంది. మిగతా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ లాగే.. దీనిపైనా వైసీపీ నేతలకు క్లారిటీ లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close