” గ్రేటర్‌ మేయర్‌”కు అమావాస్య టెన్షన్..!

హైదరాబాద్ మేయర్ ఎన్నికకు ఖరారు చేసిన ముహుర్తం వివాదాస్పదం అవుతోంది. ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతున్నా… రెండు రోజుల కిందట వరకూ.. తాము కార్పొరేటర్లమని గెలిచిన వాళ్లు చెప్పుకోలేకపోయారు. ఓ బీజేపీ కార్పొరేటర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే చనిపోయారు కూడా. దానికి కారణం పాత పాలక వర్గానికి ఇంకా గడువు ఉండటమే. ఫిబ్రవరి పదకొండో తేదీతో పాలకవర్గం గడువు ముగుస్తుంది. అప్పటి వరకూ ఆ పాలక వర్గాన్నే కొనసాగించి అదే రోజు.. కొత్త మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికను చేపడుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

అయితే ఫిబ్రవరి పదకొండో తేదీన అమావాస్య వచ్చింది. దీంతో కొంత మంది కార్పొరేటర్ అభ్యర్థులకు చిక్కులు ప్రారంభమయ్యాయి. ముహుర్తాలను నమ్మే కార్పొరేటర్లు… అమావాస్య రోజు ప్రమాణం చేయడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఈ అంశంపై మండిపడుతున్నారు. ఆ రోజు మంచి రోజు కాదన్న ఉద్దేశంతో బీజేపీ కార్పొరేటర్లు కొంత మంది అయినా డుమ్మా కొడతారని…ఆ కోణంలో మేయర్ సీటును కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే బీజేపీ నేతలు… ముహుర్తాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ కమిషనర్‌ను కూడా కలిశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. తన చేతుల్లో ఏమీ లేదని.. ఎన్నికల కమిషనరే నిర్ణయం తీసుకున్నారని తేల్చేశారు.

దాంతో ఇప్పుడు బీజేపీ నేతలు అమావాస్య రోజున ప్రమాణం చేయాలా.. లేక మొత్తంగా డుమ్మా కొట్టాలా అన్న ఆలోచనలో ఉంది. అభిప్రాయసేకరణ చేస్తోంది. పదకొండో తేదీన కోరం లేకపోతే.. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడుతుంది. ఒక్క బీజేపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరు కాకపోతే.. కోరం సమస్య రాదు. ఇతర పార్టీల కార్పొరేటర్లు కూడా అలాగే ఫీలవ్వాలి. అది కష్టమే. ఒక వేళ కోరం సమస్య వస్తే.. మరో తేదీన నిర్వహిస్తారు. రెండో సారి సమావేశం అవ్వాల్సి వస్తే .. కోరం ఉన్నా లేకపోయినా మేయర్ ఎన్నిక జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close