హైదరాబాద్‌ “యూటీ”పై మళ్లీ రాజకీయ చర్చ..!

జమ్మూ – కశ్మీర్‌ను రెండుగా విడదీసి.. యూటీలుగా చేయడంపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో.. అసదుద్దీన్ ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రాల సార్వభౌమాధికారాల్ని లాగేసుకునేందుకు భిన్నమైన వ్యూహంలో వెళ్తుందని చెప్పేందుకు … యూటీ పదాన్ని వాడుకున్నారు. ఒక్క కశ్మీర్ విషయంలోనే కాదు.. కేంద్రం త్వరలో హైదారబాద్, చెన్నై, బెంగుళూరు, కోల్ కతా వంటి పెద్ద నగరాలన్నింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తుందని వ్యాఖ్యానించారు.దీనిపై పార్లమెంట్ లో కేంద్రమంత్రులెవరూ అధికారికంగా స్పందించలేదు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చి కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిలాంటి నేతలు మాత్రం… ఓవైసీపై విరుచుకుపడుతున్నారు.

ఓవైసీ… గాలి కబుర్లు చెబుతున్నారని కేంద్రానికి అలాంటి ఉద్దేశమే కాదని.. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం ఏదో బాగుందని అనుకున్నారేమో కానీ.. కొంత మంది సోషల్ మీడియీలో దీనిపై చర్చ పెట్టారు. బీజేపీకి… హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఉద్దేశం ఉందని.. అందుకే.. పార్లమెంట్‌లో సైలెంట్ గా ఉన్నారని వాదన తీసుకొచ్చారు. నిజానికి.. హైదరాబాద్ యూటీ అనే మాట ఇదే మొదటి సారి కాదు. రాష్ట్ర విభజన తర్వాత చాలా సార్లు వచ్చింది. కొన్ని సార్లు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తారని అలా చేస్తే యూటీ చేయడం ఖాయమని చెప్పుకున్నారు.

నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా.. కేంద్రం దృష్టిలో అలాంటి ఆలోచనలు లేకపోతే.. బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పటికైతే… కేంద్రం అలాంటి ఆలోచనలు చేయకపోవచ్చు. మరోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తే… దేశాన్ని తాను అనుకున్నట్లుగా మార్చడంలో బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. అప్పుడు హైదరాబాద్ యూటీ అవుతుందా లేకపోతే.. రెండో రాజధాని అవుతుందా అన్నది అంచనా వేయడం కష్టం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్ కు సపోర్ట్ గా ప్రభాస్ ఫ్యామిలీ

పిఠాపురం నుంచి పోటీ చేస్తోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొణిదెల ఫ్యామిలీతోపాటు పలువురు సినీ ప్రముఖులు నియోజకవర్గంలో వాలిపోయి పవన్...

అవధూతగా ప్రభాస్ ?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాలో ప్రభాస్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై ఇటివలే అధికారిక ప్రకటన ఇచ్చారు. ప్రభాస్ సెట్స్ లో అడుగుపెట్టారని అభిమానులుని సర్ ప్రైజ్...

ఈటీవీ విన్… ఇలా అయితే కష్టమే!

'ఈనాడు' ఏ రంగంలో అడుగుపెట్టినా అగ్రగామిగా నిలవడానికే ప్రయత్నిస్తుంది. ఈ సంస్థ 'ఈటీవీ విన్' తో ఓటీటీలోకి ప్రవేశించింది. అయితే ఇప్పటివరకూ ఆ ఓటీటీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్స్ లో '90s' తప్పితే...

అమ్మకానికి హైదరాబాద్ మెట్రో..?

హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు ఎల్ అండ్ టీ సిద్దమైందా..? నష్టాల పేరిట మెట్రోను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే మెట్రోను ఇప్పట్లో అమ్మకానికి పెట్టడం లేదని...2026 తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close