మావాడిపై ఓ క‌న్నేసి ఉంచండి: రామ్ చ‌ర‌ణ్‌

ఉప్పెన ద్వారా మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో వ‌చ్చాడు. త‌నే వైష్ణ‌వ్ తేజ్‌. ఉప్పెన సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో… రాజ‌మండ్రిలో.. స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్ తేజ్ అతిథిగా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా వైష్ణ‌వ్ తేజ్ ని పొగ‌డ్త‌ల‌తో ముంచేశాడు. వైష్ణ‌వ్ బుద్ధిమంతుడిలా క‌నిపిస్తున్నా, లోప‌ల ఓ విస్పోట‌నం దాగుంద‌ని, ఈ కుర్రాడిపై ఓ క‌న్నేసి ఉంచాల‌ని…. స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. త‌న‌కు వైష్ణ‌వ్ లా న‌టించ‌డానికి ఏడెనిమిది సినిమాల స‌మ‌యం ప‌ట్టింద‌ని, కానీ… తొలి సినిమాకే వైష్ణ‌వ్ మెచ్యూరిటీ చూపించాడ‌ని కొనియాడాడు. తొలి సినిమా హీరోకి ఇన్ని క‌ల‌క్ష‌న్లు దొర‌కడం నిజంగా ఓ అరుదైన విష‌య‌మ‌ని, ఇది గ్రేట్ డెబ్యూ అని కితాబు ఇచ్చాడు.

“వైష్ణ‌వ్ మా కంటే భిన్నంగా ఆలోచిస్తాడు. సెటిల్డ్ గా ఉంటాడు. అందుకే తాను ఈ స‌క్సెస్ కొట్ట‌డంలో నాకు వింతేం క‌నిపించ‌డం లేదు. త‌న‌లో డెడికేష‌న్ చూసే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బాబాయ్ వైష్ణ‌వ్ కు ట్రైనింగ్ ఇప్పించారు. మానాన్న‌గారు ఈ క‌థ‌ని 4 సార్లు విన్నారు. నా సినిమా కోసం కూడా అంత స‌మ‌యం వెచ్చించి ఉండ‌రు. చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి వ్య‌క్తులు మా చుట్టూ ఉండ‌డం మా అదృష్టం” అన్నాడు చ‌ర‌ణ్‌. క‌రోనా కార‌ణంగా 2020 పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింద‌ని, ఈ ద‌శ‌లో.. మ‌ళ్లీ కోలుకున్న ఏకైక ఇండ్ర‌స్ట్రీ.. సినిమా ప‌రిశ్ర‌మ అని, ఇదంతా తెలుగు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని చెప్పుకొచ్చాడు చ‌ర‌ణ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?

సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక...

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close