వైసీపీకి మరో ఆరు ఎమ్మెల్సీ పదవులు..!

ఏపీలో వైసీపీ ఖాతాలో మరో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు పడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఫిబ్రవరి 25 నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 4. మార్చి 15న పోలింగ్‌ జరుగుతుంది. ఇవన్నీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలే. దీంతో ఒక్కో ఎమ్మెల్సీ గెలుచుకోవడానికి కనీసం 29 మంది ఎమ్మెల్యేలు కావాలి. టీడీపీకి ఇరవై మంది ఎమ్మెల్యేల బలం కూడా లేదు. దీంతో పోటీ చేసే చాన్స్ కూడా లేదు. ఖాళీ అవుతున్న ఆరు స్థానాల్లో గుమ్మడి సంధ్యారాణి, గుండుమల తిప్పేస్వామి, వీవీవీ చౌదరి టీడీపీ ఎమ్మెల్సీలు. మహ్మద్‌ ఇక్బాల్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలు.

సంధ్యారాణి, తిప్పేస్వామి, వీవీవీ చౌదరి, మహ్మద్‌ ఇక్బాల్‌ పదవీ కాలం పూర్తయింది. పిల్లి సుభాష్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే పదవి కాలం తక్కువగా ఉండటంతో ఇప్పుడు.. పూర్తయ్యాక ఎన్నికలు పెడుతున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో ఇటీవల మృతిచెందారు. రాజ్యసభకు ఎన్నికయిన మరో ఎమ్మెల్సీ మోపిదేవి స్థానాన్ని గతంలోనే భర్తీ చేశారు. నిజానికి వైసీపీ అధినేత జగన్ శాసనమండలిని రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు కూడా.

మరో ఏడాదిలో మండలిలో పూర్తి స్థాయిలో వైసీపీకి బలం వస్తుందని తెలిసినా .. అసలు మండలి అవసరం లేదని అందుకే రద్దు చేస్తున్నామని శాసనసభలో ప్రకటించారు. కానీ ఇప్పుడు.. యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఖాళీ అవుతున్న ప్రతీ ఎమ్మెల్సీని తమ పార్టీ నేతలతో భర్తీ చేస్తున్నారు. దీంతో శాసనమండలి రద్దు కాదన్న ప్రచారం ఊపందుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close