కుప్పంలో రిపేర్లకు చంద్రబాబు పయనం..!

పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో అత్యధిక పంచాయతీలు గెలిచి చంద్రబాబు పట్టు జారిపోయిందని నిరూపించాలనుకున్న వైసీపీ అనుకున్న ఫలితాన్ని సాధించింది. కుప్పంపై గురి పెట్టారని తెలుసుకున్నా… స్థానిక నేతలపై ఎక్కువ నమ్మకం ఉంచిన చంద్రబాబు… ఈసీకి లేఖలు రాయడం తప్ప ఏమీ చేయలేదు. దాంతో ఫలితాలు తేడా వచ్చేశాయి. ఇప్పుడు పరిస్థితిని చక్క దిద్దుకోకపోతే మొదటికే మోసం వస్తుందని అనుకుంటున్నారేమో వెంటనే.. చలో కుప్పం టూర్ పెట్టుకున్నారు. ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకూ మూడు రోజుల పాటు కుప్పంలోనే మకాం వేసి.. పార్టీ పరిస్థితిని మెరుగుపర్చడానికి పార్టీ నేతలతో కలిసి మంతనాలు నిర్వహించనున్నారు.

కుప్పంలో చంద్రబాబుకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆయన మెజార్టీ ఎప్పుడైనా యాభై వేల దరి దాపుల్లో ఉంటుంది. అక్కడ టీడీపీ అభ్యర్థులకు వచ్చే మెజార్టీతోనే చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్‌లో టీడీపీ అభ్యర్థి గెలుస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో చంద్రబాబు తొలి రెండు రౌండ్లలో వెనుకబడ్డారు.చివరికి ముఫ్పై వేల చిల్లర ఓట్లతో గెలిచినప్పటిప్పటికీ…మెజార్టీ తగ్గిన ప్రభావం చిత్తూరు పార్లమెంట్ సీటుపై పడింది. ఆ సీటును కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితి మరింత దిగజారింది. కుప్పంలో పంచాయతీల్ని కోల్పోవడానికి కారణం అప్రజాస్వామిక విధానాలని.. పెద్దిరెడ్డి రూ. అరవై కోట్లు ఖర్చు పెట్టాడని.. రౌడీయిజం చేశారని రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు.

కానీ అవన్నీ చేస్తారని టీడీపీ నేతలకు తెలుసు. తెలిసి కూడా ఏమీ చేయలేకపోయారంటే అది అసమర్థతే అవుతుంది. ముఖ్యమంత్రిగా ఉండగా తాను కుప్పం ప్రజల అభ్యున్నతి చేసిన సేవలు.. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రతి కుటుంబానికి అందిన సాయం తమపై ప్రజల విశ్వాసాన్ని చెరపలేవని టీడీపీ నేతలకు ధీమాకు పోయారు. కానీ రాజకీయం మారిందని తాజా ఫలితాలతో వెల్లడైంది.చంద్రబాబు ఇప్పుడు… పరిస్థితులు చక్కదిద్దుకోవడానికి వెళ్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close