సాగర్‌లో బీజేపీది దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితే..!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సారిగా వచ్చిన ఊపు.. ఆ పార్టీకి చిక్కులు కూడా తెచ్చి పెడుతోంది. నాగార్జున సాగర్‌లో పోటీ చేసేది తామంటే తాము అని పోటీ పడుతూండటంతో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడినట్లుగా గ్రూపులు ఏర్పడ్డాయి. నిజానికి బలమైన అభ్యర్థి లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిపై బీజేపీ కన్నేసింది. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ చివరి క్షణం వరకూ అభ్యర్థి కోసం ఎలా ఎదురు చూసిందో.. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతే. అక్కడ కాంగ్రెస్‌లో ఉన్న నేతలు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. ఇక్కడ బీజేపీది అలాంటి పరిస్థితే. చివరికి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ ముందు కూడా నేతలు టిక్కెట్ కోసం పోటీపడ్డారు.

దాంతో బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని.. ఎవరూ పార్టీ లైన్ దాటరని అనుకున్న ఆయన పరిస్థితి తేడాగా ఉందని… చూసుకోమని బండి సంజయ్‌కు చెప్పి వెళ్లిపోయారు. ఏ క్షణమైనా సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వస్తుంది. మే రెండో తేదీనకౌంటింగ్ జరిగే.. ఎన్నికలు తేదీలు ఉండటం ఖాయం. అయితే ఎప్పుడు తేదీలు వస్తాయన్నది సస్పెన్స్ గా మారింది. ఈ క్రమంలో అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో దూసుకెళ్లాలని అనుకుంటున్నారు. దీంతో అభ్యర్థిని ఖరారు చేసేందుకు నాగార్జున సాగర్‌లో సమీక్షా సమావేశం పెట్టారు. కనీసం పది మంది నేతలు టిక్కెట్ కోసం పోటీ పడటం.. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్న వైనం అగ్రనేతలకు ఆగ్రహం తెప్పించింది. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని పార్టీ ఎవరికి టిక్కెట్ ఇస్తే వారి కోసం అందరూ కలిసి పని చేయాలని బండి సంజయ్ సూచించి ఆయన కూడా హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు.

అయితే కాంగ్రెస్ లో ఉన్నట్లుగా అంతర్గత ప్రజాస్వామ్యం బీజేపీలోనూ ఎక్కువవుతోందన్న సైటైర్లకు బండి సంజయ్ కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేశారు. గెలిచేది తామే కాబట్టే.. మా పార్టీలో టికెట్ కోసం ఎక్కువ పోటీ ఉందని.. టికెట్ తమకే రావాలని నాయకులు కోరుకోవడం తప్పులేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి సాగర్‌లో బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రెండు వేలకు కాస్త ఎక్కువ. ఈ సారి పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరోవైపు తమకు పోటీ కాంగ్రెస్‌తోనేనని టీఆర్ఎస్ చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close