ఉచిత విద్యుత్‌కి కూడా గ్యాస్ నగదు బదిలీ ఫార్ములానే..!?

2013లో కేంద్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని నగదు బదిలీ రూపంలోకి మార్చాలనుకుంది. అప్పుడు బీజేపీ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ప్రజల్ని దోచుకుంటున్నారని.. క్రమంగా సబ్సిడీని ఎత్తేయడానికి ఈ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కూడా నమ్మి ఉద్యమంలోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.కానీ మోడీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకి.. నగదు బదిలీ ప్రారంభించారు. వ్యతిరేకించిన వారందరూ దేశభక్తులు కాదని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంతో ఎవరూ.. నోరు మెదపలేదు. అప్పట్లో రూ. ఎనిమిది వందలు ఉండే గ్యాస్ సిలిండర్ ధరకు.. రూ. మూడు వందల వరకూ సబ్సిడీ వచ్చేది. ఎంతో కొంత ఇస్తున్నారు కదా అని ప్రజలు సర్దుబాటు చేసుకున్నారు.

కానీ ఇప్పుడు.. ఆ సబ్సిడీ.. రూ. నాలుగు నుంచి పదహారు రూపాయలకు పడిపోయింది. దీంతో ప్రజలు అవాక్కవ్వాల్సి వస్తోంది. అలాగని గ్యాస్ సిలిండర్ రేటు ఏ మాత్రం తగ్గలేదు. సబ్సిడీని వదులుకోవాలంటూ కేంద్రం… ఓ ప్రచారం చేసింది. స్టార్లతో ప్రకటనలు ఇప్పించింది. కానీ ఎక్కువ మంది వదులుకోలేదు. ఇప్పుడు సబ్సిడీ ఎత్తేసి కేంద్రమే ఎత్తేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరు చూసి నగదు బదిలీలో ఇంత మోసమా అని .. ప్రజలు నోళ్లు నొక్కుకోవాల్సి వస్తోంది. ఇక ముందు ప్రభుత్వాలు నగదు బదిలీ చేస్తే ఇలాగే ఉంటుందా అన్న చర్చ కూడా ప్రారంభమయింది. ఏపీలో వ్యవసాయ దారులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఉచిత విద్యుత్ వద్దు.. మీటర్లు పెట్టి.. ఎంత వాడుకుంటే అంత నగదు బదిలీ చేయమని చెప్పింది. అలా చేస్తే రూ. నాలుగు వేల కోట్ల రుణం ఇస్తామని చెప్పింది.

దానికి ఏపీ సర్కార్ అంగీకరించి.. మీటర్లు పెడుతోంది. నగదు బదిలీ చేస్తామని… కంగారు పడొద్దని చెబుతోంది. కానీ గ్యాస్‌కు నగదు బదిలీలో ప్రభుత్వం చేసిన మాయాజాలం చూసిన తర్వాత చాలా మంది రైతులు కంగారు పడిపోతున్నారు. తమకూ ఇదే పరిస్థితి తీసుకొస్తే ఏం చేయాలా అని మథనపడుతున్నారు. కానీ ఇప్పటికే.. రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి అంగీకరించింది. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఇప్పుడు రైతులు తప్పించుకోలేని స్థితిలో ఉన్నారు. మహా అయితే రెండు మూడేళ్లు మాత్రమే.. నగదు బదిలీ ఉంటుందని.. ఆ తర్వాత ఉచిత విద్యుత్ ఎగిరిపోయినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close