అసలు కేసేంటి..? జగన్ బినామీలపై విదేశీయులు చేసిన ఫిర్యాదులేంటి..?

జగన్‌కు అత్యంత సన్నిహితులు, బినామీలుగా పేరు పడిన వారు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారంటూ విదేశీయుల నుంచి వచ్చిన ఫిర్యాదులు కేంద్రానికి అందాయని.. బీజేపీ అధికారిక మీడియా లాంటి రిపబ్లిక్ చానల్ ప్రకటించడం ఏపీలో సంచలనం అవుతోంది. ఈ మేరకు తెలుగు 360 ఇచ్చిన కథనం.. వైరల్ అయింది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశం అయింది. సహజంగానే ఈ కథనంపై వైసీపీ నేతలు నోరు తెరవలేదు. కానీ విపక్షనేతలు మాత్రం… అంతర్జాతీయ స్కామ్‌లు చేస్తున్నారని.. త్వరలో జైలుకెళ్లే రాత మళ్లీ ఉందని విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరికీ..అసలు కేసేంటి అన్న విషయంపై స్పష్టత లేదు.

కేంద్రానికి ఫిర్యాదు చేసిన విదేశీయులు.. ఆషామాషీగాఫిర్యాదు చేయలేదు. చాలా పక్కా ఆధారాలతో జగన్ సన్నిహిత ఆర్థిక నేరాల గురించి సమాచారంతో సహా… ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ అంశంపై కేంద్రం దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయని అంటున్నారు. ఇప్పటికే అంతర్గత దర్యాప్తు కూడా చురుకుగా సాగుతోందని అంటున్నారు. లోకల్‌గా జరిగే అవినీతి అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారం ఎలా ఉన్నా.. విదేశీయుల నుంచి.. అదీ కూడా విదేశాల్లో చేస్తున్న ఆర్థిక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులు దేశ ప్రతిష్టకు సంబంధించినవి కాబట్టి సీరియస్‌గా తీసుకున్నారని చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో కొంత మంది జగన్ అనుచరులు.. సన్నిహితులు.. బినామీలుగా పేరు తెచ్చుకున్నవారు.. విదేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ప్రయత్నించారని అంటున్నారు. అయితే అనేక దేశాల్లో అలాంటి పెట్టుబడులకు ఆదాయ వివరాలు సంపూర్ణంగా ఆయా దేశాలకు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో చట్టాలతో పాటు విదేశాల్లో ఉండే వివిద రకాల వెసులుబాట్ల ఆధారంగా … ఆదాయ వనరుల గురించి చెప్పకుండానే పెట్టుబడులు పెట్టేవారు. వాటిని మళ్లీ సూట్ కేసు సంస్థల ద్వారా ఇండియాకు రప్పించేవారు. ఇలాంటి కేసులు పెద్ద ఎత్తున ఇండియాలో నమోదయ్యాయి. బహుశా.. ఇలాంటి వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు అందాయన్న ప్రచారం జరుగుతోంది.

నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా ప్రస్తుతం జగన్ కి ట్రబుల్ అంటూ… రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనానికి చాలా లోతైన అర్థం ఉందని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించిన సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తాయని విపక్ష నేతలు అంచనా వేస్తున్నారు. సీఎం జగన్ మూడు రోజుల కిందట… ఢిల్లీకి వెళ్లి అర్జంట్‌గా అమిత్ షా, మోడీలతో సమావేశం కావాలనుకున్నారు. నేరుగా సీఎంవో ద్వారా వారి అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అపాయింట్‌మెంట్లు ఖరారు కాకపోవడంతో ఢిల్లీ వెళ్లలేదు. ఇప్పుడీ విషయానికి… విదేశీయులు చేసిన ఫిర్యాదులకు కలిపి.. విమర్శలు చేస్తున్నారు విపక్ష నేతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close