స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి “నాటి ఉద్యమకారుడు” చిరంజీవి సపోర్ట్..!

విశాఖ ఉక్కు ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ప్రకటన చేశారు. ఆయన రాజకీయ అంశాలపై స్పందించి చాలా కాలం అయింది. సినీ పరిశ్రమ గురించి తప్ప ఇతర విషయాలు మాట్లాడటం లేదు. అందుకే విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి కూడా ఆయన స్పందిస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ.. అనూహ్యంగా చిరంజీవి ఉక్కు పరిరక్షణ సమితి పోరాటానికి తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే.. చిరంజీవి స్పందించడానికి కారణం కూడా ఉంది. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ 1960లలో ఎగసిన ఉద్యమంలో చిరంజీవి కూడా భాగం అయ్యారు. నర్సాపురంలో చిరంజీవి వైఎన్ఎం కాలేజీలో చదువుతున్న సమయంలో ఈ ఉద్యమం వచ్చింది.

ఆ సమయంలో చిరంజీవి కూడా స్వయంగా పెయింట్, బ్రష్ చేతబట్టి.. విశాఖ ఉక్కు నినాదాలను గోడలపై రాశారట. ఇదే విషయాన్ని చిరంజీవి తన ట్వీట్‌లో గుర్తు చేసుకున్నారు. విశాఖ ఉక్కు పోరాటంలో తనది కూడా పాత్ర ఉండటంతో అమ్మేస్తున్నారని తెలిసి చిరంజీవి భావోద్వేగానికి గురై.. ఇలా మద్దతు తెలిపి ఉంటారని భావిస్తున్నారు. క్యాప్టివ్ మైన్స్ కేటాయించకుండా.. నష్టాలొస్తున్నాయని అమ్మడం సమజసం కాదనేది చిరంజీవి వాదన. నిజానికి చిరంజీవి వయసులో ఉన్న తెలుగు వారందరికీ.. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఎగసి పడినప్పుడు యువకులుగా ఉన్న వారికి… స్టీల్ ప్లాంట్‌తో మానసిక బంధం ఉంటుంది. తాము కూడా పోరాడామని.. ఆ పోరాట ఫలితంగానే ఆ ప్లాంట్ వచ్చిందన్న సంతృప్తి ఉంటుంది.

ఇప్పుడు పోరాట ఫలాన్ని అమ్మేస్తున్నారని తెలిస్తే.. అందరూ బాధపడతారు. ఇప్పుడు చిరంజీవి పరిస్థితి కూడా అదే అంటున్నారు. అందుకే ఆయన స్పందించి.. మద్దతు తెలిపారని అంటున్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయడానికి ఏమీ లేదు .. విశాఖ ఉక్కు ఉద్యమకారునిగా చిరంజీవి ఆందోళనను గుర్తించాలి. అది సగటు ఆంధ్రుడి భావనగా కేంద్రం గుర్తిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close