క్రైమ్ : రెండో భర్తను చంపేసి ఇంట్లోనే పాతిపెట్టిన భార్య..!

ఆమెకు నలుగురు పిల్లలు. కానీ భర్తతో విబేధాలొచ్చాయి. విడిపోయింది. రెండో పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లు బాగానే ఉంది. అయితే హఠాత్తుగా ఆ భర్త కనిపించకుండా పోయాడు. మిస్సింగ్ కేసు పెట్టి ఆమె కూడా.. ఎక్కడికో వెళ్లిపోయింది. పోలీసులు ఈ కేసులో మిస్టరీని చేధిస్తే.. నమ్మశక్తం కాని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత నెల 18 వ తేదీన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మిస్సింగ్ కేసు నమోదు అయింది.. గగన్ అగర్వాల్ అనే వ్యాపారి కనిపించడం లేదని .. అతని భార్య నౌసియా బేగం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గగన్ అగర్వాల్ ఇల్లు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో 24 వ తేదీన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కి కేసును బదిలీ చేశారు. విచారణలో పోలీసులు మొదటగా భార్య నౌసియా బేగంనే విచారించారు. ఆమె చాలా మాటలు చెప్పింది కానీ.. పోలీసులకు క్లూ దొరకలేదు. ఆమె మాటల్ని బట్టి… పోలీసులకు తేడా అర్థమైంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తూ వచ్చారు. చివరికి మిస్టరీ తేల్చారు. గగన్ అగర్వాల్ ఇంట్లోనే ఓ చోట సమాధి అయిన గగన్ అగర్వాల్ శవాన్ని పోలీసులు బయటకు తీశారు. అప్పటికే కేసును చేధించారు. గగన్ అగర్వాల్‌ను ఆయన భార్య నౌసియా బేగమే చంపేసి పాతి పెట్టిందని గుర్తించారు. శవాన్ని బయటకు తీసి మిగతా తీగలు లాగుతున్నారు.

గగన్ అగర్వాల్ భార్య నౌసియా బేగం అగర్వాల్ ను తానే కత్తితో హత్య చేసి ఇంటి వెనుకాల పూడ్చి పెట్టినట్టు విచారణలో ఒప్పుకుంది.. ఎందుకు అలా చేశారంటే.. తన నలుగురు కూతళ్లతో గగన్ అగర్వాల్ తప్పుగా ప్రవర్తిస్తున్నాడని వారిని రక్షించడానికే అన్ని చంపానని చెప్పుకొచ్చింది. అయితే అసలు విషయం ఏమిటంటే గగన్ అగర్వాన్ ను నౌసియా రెండో పెళ్లి చేసుకుని నాలుగేళ్లు అయింది. ఒక్క సారి కూడా ఆమె నలుగురు పిల్లలు ఆ ఇంటికి రాలేదని… గగన్ అగర్వాల్ బంధువులు పోలీసులకు తేల్చి చెప్పారు. కొన్ని ఆధారాలు కూడా అందించారు. దీంతో పోలీసులు మరో వైపు నుంచి విచారణ ప్రారంభించారు.

హత్య చేసి.. గగన్ అగర్వాల్ ను ఇంట్లోనే పూడ్చేసిన తర్వాత గౌసియా .. వేరే వ్యక్తితో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయింది. హత్యలో అతను కూడా పాలు పంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకూ బయటపడింది కొంతే.. ఇంకా చాలా బయటపడాల్సి ఉందని పోలీసులు భావిస్తున్నారు. విచారణ జరుపుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close