స్టీల్ ప్లాంట్ 19వేల ఎకరాలు రూ. 55 కోట్లట..!

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రుణాలు పెరిగిపోవడం, ఉత్పాదకత తగ్గిపోవడమే కారణమని పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ మరోసారి చెప్పారు. ఈ సారి కూడా.. వైసీపీ సభ్యుడే ప్రత్యేకంగా ప్రశ్న వేయించి చెప్పించారు. నష్టాలు పూడ్చడానికి సీఎం జగన్ ఏడు వేల ఎకరాల సలహాలను పదే పదే ఇస్తున్నారు. ఏడు వేల ఎకరాలు ప్లాట్లుగా వేసి అమ్మేస్తే.. స్టీల్ ప్లాంట్ నష్టాలన్నీ తీరిపోతాయని అంటున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ మొత్తం భూముల విలువ రూ. 55కోట్లుగానే కేంద్రం లెక్క కట్టినట్లుగా నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మీద భూములు లేవు. రాష్ట్రపతి పేరుపై ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల కోసం భూసేకరణ చేసినప్పుడు ఇలాగే చేశారు. ఇప్పుడు..స్టీల్ ప్లాంట్‌తో పాటు భూముల్ని కూడా విలువ కట్టి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు… ఆ భూములు 19,703 ఎకరాలను రూ. 55 కోట్ల 82లక్షల రూపాయలుగా లెక్కగట్టారు. ఇదేం లెక్క అంటే.. భూసేకరణ జరిపినప్పుడు ఇదే విలువ ఉందట. ఈ కారణంగా అదే లెక్కను దాదాపు యాభై ఏళ్ల తర్వాత చూపించి అమ్మకానికి పెట్టేస్తున్నారు.   ఈ ఒక్క నిర్ణయంతోనే ఉక్కు కర్మాగారానికి సుమారు లక్ష కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లబోతోంది.

కేంద్రం నిర్ణయం కారణంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేయబోయే సంస్థకు లక్ష కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది పెద్ద స్కాంగా కార్మిక సంఘాలు అనుమానిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు విలువ కట్టే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఇదే అనుమానాలను రేకెత్తిస్తోంది. విశాఖపట్నంలో భూముల విలువ… ఎన్నో రెట్లు పెరిగింది. ఐదేళ్ల కిందట కొన్న స్థలం విలువే రెట్టింపు అవుతూంటే… యాభై ఏళ్ల కిందటి విలువలు మార్చకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇదే పద్దతిలో కేంద్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే… ప్రజలు తిరగబడటం మాత్రం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close