ఏపీ బీజేపీ గురించి పట్టించుకునే మీడియా ఏది..!?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇప్పుడు గింజుకుంటున్నారు. గతంలో ఏదో ఓ మీడియాలో కవరేజీ వచ్చేది. ఇప్పుడు ఏ మీడియాలోనూ వారు కనిపించడం లేదు. గతంలో ఆంధ్రజ్యోతినే ఎంతో కొంత కవరేజీ ఇచ్చేది. ఇప్పుడు ఆ చాన్స్ లేకుండా పోయింది. వారే స్వయంగా ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయడంతో ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. తిరుపతి ఉపఎన్నికల నేపధ్యంలో సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ మీడియాలోనూ వారి హడావుడి కనిపించడం లేదు. గతంలో అలా ఉండేది కాదు. ఇప్పుడు… ఎన్నికల షెడ్యూల్ వచ్చినా… అసలు బీజేపీ ఎలాంటి కసరత్తు చేస్తుందో కూడా పట్టించుకునే తీరిక లేదు. జనసేన పార్టీ సీటును త్యాగం చేసేసింది. అప్పుడు కావాల్సినంత హైప్ రావాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో మీడియా భిన్నం. పార్టీల వారీగా చీలిపోయింది. ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా.. ఒక్క న్యూస్ మాత్రమే రిపోర్ట్ చేస్తూ ఈటీవీ ఒక్కటే కాస్త తటస్థంగా కనిపిస్తూ ఉంటుంది మిగతా చానళ్లలో బీజేపీకి కవరేజీ కావాలంటే… ఆయా పార్టీలకు అనుకూలమైన ప్రకటనలు లేదా.. తమకు దగ్గరగా ఉన్న పార్టీకి వ్యతిరేక పార్టీపై విమర్శలు చేయాలి. అలా అయితేనే కవరేజీ వస్తుంది. అలా చేయడం వల్ల.. ఆ పార్టీలకు మాత్రమే లాభం కానీ .. బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. ఇప్పుడు బీజేపీ ఉపఎన్నికల బరిలో దిగింది. ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది మీడియా అండ. బీజేపీకి అంతో ఇంతో సపోర్ట్‌గా నిలిచే ఆంధ్రజ్యోతి కవరేజీ లేకపోవడంతో.. ఆ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది.

తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం కోసం ఇప్పుడు బీజేపీ వెంపర్లాడాల్సిందే. ఎందుకంటే… వైసీపీ అనుకూల మీడియాలో ఇక బీజేపీకి చోటు దక్కదు. ఎందుకంటే.. ఆ పార్టీ భారీ మెజార్టీపై కన్నేసింది. ఏమైనా ఢిల్లీ స్థాయిలో అండర్ స్టాండింగ్ పెట్టుకుని కవరేజీ ఇవ్వాలన్న రూల్ ఉంటే తప్ప కవరేజీ రాదు. ఇక టీడీపీ అనుకూల మీడియాను ఓ రకంగా బీజీపేనే దూరం పెట్టింది. ఇక సోషల్ మీడియాలోనూ ఆ పార్టీ అంత చురుకుగా లేదు. ఏతావాతా చివరికి… తన కోపమే తనకు శత్రువన్నట్లుగా బీజేపీ మీడియా కేవరేజీకి గండి పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close