నెక్ట్స్ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ..!

భారత అత్యున్నత న్యాయస్థానానికి మరో తెలుగు వ్యక్తి చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. జస్టిస్ నూతలపాటి వెంకట రమణను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ  బోబ్డే కేంద్రానికి సిఫార్సులు పంపించారు. ప్రక్రియ ప్రకారం.. కేంద్రం ఈ నివేదిక పంపాలని కొద్ది రోజుల కిందట.. చీఫ్ జస్టిస్‌ను కోరింది. సంప్రదాయంగా.. చీఫ్ జస్టిస్ కూడా.. సీనియార్టీలో తన తర్వాత ఉన్న ఎన్‌వీ రమణ పేరును సూచిస్తూ.. కేంద్రానికి సిఫార్సు చేశారు.

సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్‌ రమణ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమే. కేంద్రం అధికారికంగా నోటిఫై చేయడమే మిగిలి ఉంది. జస్టిస్‌ బోబ్డే సిఫార్సును కేంద్ర న్యాయశాఖ.. హోంశాఖకు పంపనుంది. హోంశాఖ పరిశీలన అనంతరం ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో సీజేఐ ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. జస్టిస్‌ బోబ్డే వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్‌ 24న జస్టిస్‌ ఎన్వీ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్‌వీ రమణ వచ్చే ఏడాది ఆగస్టు ఇరవై ఆరో తేదీ వరకూ పదవిలో ఉంటారు.

ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచే అనేక కుట్రలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. మరో హైకోర్టు మాజీ న్యాయమూర్తి వివిధ పద్దతుల్లో ఎన్వీ రమణపై వివిధ రకాల అభియోగాలు మోపేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే… జస్టిస్ ఎన్వీ రమణపై అనేక రకాల అభియోగాలు పేర్కొంటూ… చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకు లేఖ రాశారు. దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. ఇదంతా ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఎన్వీ రమణను అలాంటివీ చీఫ్ జస్టిస్ కాకుండా ఆపలేకపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close