కేసీఆర్ ప్రధాని అయితే ప్రజలకు సమస్యలే ఉండవట..!

మీకు ఆరోగ్య సమస్యలేమీ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి..?. జిందాతిలిస్మాత్ వాడండి..! అనే ప్రకటన చాలా సార్లు చూసి ఉంటాం. ఇదే తరహాలో.. దేశంలో ప్రజలందరికీ ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి..? . ఏమీ చేయక్కర లేదు.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ను ప్రధానమంత్రిని చేస్తే చాలు. దేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నీ మటుమాయం అయిపోతాయి. ఇలా చెప్పింది ఎక్కడో కాదు.. తెలంగాణ అసెంబ్లీలో.. చెప్పింది ఎవరో కాదు.. కేసీఆర్ కేబినెట్‌లోని మంత్రి మల్లారెడ్డి. అసలు దేశంలోని ప్రజల సమస్యలేమిటో… వాటికి పరిష్కారం.. కేసీఆర్ ప్రధాని కావడం అని మల్లారెడ్డి ఎందుకనుకున్నారో తోటి సభ్యులకు అర్థం కాలేదు కానీ.. పొగిడింది కేసీఆర్‌ను కాబట్టి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చప్పట్లు కొట్టారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనను కేసీఆర్ ఇప్పటికి విరమించుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి .. మళ్లీ కేసీఆర్ ప్రధాని అనే వాదనను అసెంబ్లీలోనే తీసుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల వరకూ హడావుడి చేశారు. ఆ సమయంలో… గ్రేటర్ ఎన్నికలు ముగియగానే బీజేపీయేతర పార్టీల సమావేశం ఉంటుందని.. తాను అందరితో మాట్లాడానని చెప్పారు. అయితే గ్రేటర్ ఎన్నికలు ముగియగానే ఆయన బీజేపీతో రణం లేదు.. రాజీ లేదు అనే ఫార్ములా అవలంభించారు.

దీంతో ఆయన వెనక్కి తగ్గిపోయారని అందరికీ క్లారిటీ వచ్చింది. కానీ మల్లారెడ్డి మాత్రం.. మళ్లీ కేసీఆర్ ప్రధాని అనే వాదనను అసెంబ్లీలోనే తీసుకు వచ్చారు. అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలు సీరియస్‌గానా.. లేకపోతే.. ఆయన స్టైల్లోనే అనేసి ఉంటారా అన్న చర్చ జరుగుతోంది. ఎదుకంటే.. కేసీఆర్‌ను పొగడటంతో ఎవరి స్టైల్ వారిది. మల్లారెడ్డి స్టైల్ మల్లారెడ్డిదని .. సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. కొంత మంది టీఆర్ఎస్ నేతలే అనుకుంటూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close