తెలంగాణ రాజకీయ అజెండాను మారుస్తున్న “ఆత్మహత్య”..!

ఓ ఆత్మహత్య తెలంగాణలో రాజకీయ కలకలం రేపుతోంది. వారం రోజుల కిందట.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో బోడ సునీల్ నాయక్ అనే నిరుద్యోగి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ… శుక్రవారం చనిపోయారు. ఆత్మహత్యాయత్నం చేసినప్పుడే.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. బీజేపీ నేతలు.. సహా విపక్ష నేతలందరూ.. సునీల్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అయితే సునీల్ ఆరోగ్యం విషమించడంతో మరణించారు. దీంతో విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై విరుచుకుపడటం ప్రారంభించాయి.

బోడ సునీల్‌ది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వం చేసిన హత్య అంటూ.. విరుచుకుపడ్డారు. బోడ సునీల్ సూసైడ్ నోట్ కూడా రాశారు. అందులో ప్రభుత్వం కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నేరుగానే చెప్పారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలనే డిమాండ్లను విపక్షాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌పై కేసు పెట్టాలని కోదండరాం డిమాండ్ చేశారు. కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజకీయాల కోసం కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో యాభై శాతం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తక్షణం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదు..కేసీఆర్ చేసిన హత్య అని బండి సంజయ్ మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలంటున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. సునీల్ నాయక్ కు నివాళిగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాల పాత్రను ఎవరూ తీసిపారేయలేరు. ఎక్కడికక్కడ యువత ప్రాణాలు అర్పించడంతోనే ఉద్యమం ఎగసి పడింది. ఇప్పుడు అదే తరహాలో ఉద్యోగాల భర్తీ కోసం సునీల్ ఆత్మార్పణం నిప్పు రాజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు యాభై వేల ఖాళీల భర్తీ అని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు పెద్దగా స్పందించడం లేదు. త్వరలో భర్తీ.. త్వరలో భర్తీ అనే ప్రకటనలు మాత్రం వస్తున్నాయి. ఈ క్రమంలో బోడ సునీల్ ఆత్మహత్య చేసుకోవడం… రాజకీయ ఎజెండాను మార్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close