బీజేపీ మిత్రోం కోసం చెమటోడుస్తున్న వైసీపీ..!

వైసీపీ నేతలు బీజేపీ మిత్రపక్షాల గెలుపు కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అది తిరుపతిలో కాదు.. యానాంలో. పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో యానాం కూడా ఓ భాగం. కాకినాడలో కలిసిపోయినట్లుగా ఉండే యానాం నుంచి ఓ ఎమ్మెల్యే పుదుచ్చేరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. మల్లాడి కృష్ణారావు అనే ఎమ్మెల్యే ఇప్పటి వరకూ చాలా సార్లు గెలిచారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి. అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోవడంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. తన సీటును.. బీజేపీ మిత్రపక్షానికి త్యాగం చేశాడు. పుదుచ్చేరిలో అన్నాడీఎంకే, బీజేపీ, రంగస్వామి పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి.

రంగస్వామి మాజీ ముఖ్యమంత్రి. ఆయనే కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. ఇప్పుడు ఆయన ఇతర చోట్ల పోటీ చేస్తే గెలుస్తారో లేదో అనుకున్నారో కానీ.. యానాంకు తీసుకు వచ్చి .. అక్కడ పోటీ చేయిస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న మల్లాడి కృష్ణారావు తన సీటును త్యాగం చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా… ఇప్పుడు రంగస్వామి గెలుపు కోసం.. వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులంతా అక్కడే మకాం వేశారు. సభలు.. సమావేశాలు పెట్టి రంగస్వామికి మద్దతివ్వాలని ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు.. ఏపీలో చర్చనీయాంశం అవుతోంది.

ఓ వైపు తిరుపతిలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు.. రకరకాల వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో ఆగర్భ శత్రువులు అన్నట్లుగా తిట్టుకుంటున్నారు. కానీ.. పుదుచ్చేరిలో బీజేపీ సర్కార్ ఏర్పడటానికి వైసీపీ తెర వెనుకే కాదు.. తెర ముందు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ దోస్తీ ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎప్పట్లాగే… సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close