బీజేపీ మిత్రోం కోసం చెమటోడుస్తున్న వైసీపీ..!

వైసీపీ నేతలు బీజేపీ మిత్రపక్షాల గెలుపు కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అది తిరుపతిలో కాదు.. యానాంలో. పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో యానాం కూడా ఓ భాగం. కాకినాడలో కలిసిపోయినట్లుగా ఉండే యానాం నుంచి ఓ ఎమ్మెల్యే పుదుచ్చేరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. మల్లాడి కృష్ణారావు అనే ఎమ్మెల్యే ఇప్పటి వరకూ చాలా సార్లు గెలిచారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి. అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోవడంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. తన సీటును.. బీజేపీ మిత్రపక్షానికి త్యాగం చేశాడు. పుదుచ్చేరిలో అన్నాడీఎంకే, బీజేపీ, రంగస్వామి పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి.

రంగస్వామి మాజీ ముఖ్యమంత్రి. ఆయనే కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. ఇప్పుడు ఆయన ఇతర చోట్ల పోటీ చేస్తే గెలుస్తారో లేదో అనుకున్నారో కానీ.. యానాంకు తీసుకు వచ్చి .. అక్కడ పోటీ చేయిస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న మల్లాడి కృష్ణారావు తన సీటును త్యాగం చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా… ఇప్పుడు రంగస్వామి గెలుపు కోసం.. వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులంతా అక్కడే మకాం వేశారు. సభలు.. సమావేశాలు పెట్టి రంగస్వామికి మద్దతివ్వాలని ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు.. ఏపీలో చర్చనీయాంశం అవుతోంది.

ఓ వైపు తిరుపతిలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు.. రకరకాల వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో ఆగర్భ శత్రువులు అన్నట్లుగా తిట్టుకుంటున్నారు. కానీ.. పుదుచ్చేరిలో బీజేపీ సర్కార్ ఏర్పడటానికి వైసీపీ తెర వెనుకే కాదు.. తెర ముందు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ దోస్తీ ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎప్పట్లాగే… సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close