‘పుష్ష’ యాక్ష‌న్ సీన్స్‌కే 40 కోట్లు?!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ సినిమా `పుష్ష‌`. ఈమ‌ధ్యే టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. `త‌గ్గేదే లే..` అంటూ.. బ‌న్నీ త‌న విశ్వ‌రూపం చూపించాడు. త‌న లుక్‌, ఎటిట్యూడ్‌, డైలాగ్ డెలివరీ… అన్నీ ఈ సినిమాలో కొత్త‌గా క‌నిపిస్తున్నాయి. టీజ‌ర్‌లో ఎక్కువ‌గా యాక్ష‌న్ షాట్సే క‌నిపించాయి. సినిమా కూడా అంతేన‌ట‌. సుకుమార్ తొలిసారి…. త‌న సినిమాల్లో యాక్ష‌న్, ఛేజింగుల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. సినిమా మొత్తం దాదాపుగా 6 యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఉండ‌బోతున్నాయి. అందుకోసం ఏకంగా 40 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌బోతున్న‌ట్టు టాక్‌. అట‌వీ నేప‌థ్యంలో ఓ యాక్ష‌న్ సీన్ ని ఫైట్ మాస్ట‌ర్‌.. పీట‌ర్ హెయిన్స్ ఆధ్వ‌ర్యంలో తెర‌కెక్కించారు. అది ఈ సినిమాకే హైటెల్ గా నిల‌వ‌బోతోంద‌ట‌. ప్రీ క్లైమాక్స్‌కి ముందు, క్లైమాక్స్‌లోనూ మ‌రో రెండు యాక్ష‌న్ సీక్వెన్స్ ఉండ‌బోతున్నాయి. అవి మ‌రో రేంజ్ లోఉంటాయ‌ని స‌మాచారం. ఎక్కువ‌గా రాత్రి పూట షూటింగ్ చేయ‌డం వ‌ల్ల‌, కొత్త త‌ర‌హా కెమెరాలు, ప‌రిక‌రాలు తీసుకురావ‌డం వ‌ల్ల‌.. బ‌డ్జెట్ పెరిగింద‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close