అమరరాజాను ఏపీ నుంచి తరిమేస్తున్న ప్రభుత్వం..!

బ్యాటరీల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రముఖ బ్రాండ్‌గా ఉన్న అమరరాజా కంపెనీని ఏపీ నుంచి తరిమేసేశాదాకా ప్రభుత్వం నిద్ర పోయేట్లుగా లేదు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని.. . సంస్థను మూసివేయాలంటూ.. ఏపీ సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. గత వారం.. కడప జిల్లాలో అతి పెద్ద సిమెంట్ పరిశ్రమల్లో ఒకటిగా ఉన్న జువారిప్లాంట్‌ను మూసేయాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే కరెంట్ కూడా నిలిపివేశారు. ఆ సంస్థ సెటిల్మెంట్ ఏమైనా చేసుకుందేమో బయటకు రాలేదు కానీ.. అధికారిక ప్రకటన చేస్తామని.. తర్వాత స్పందించలేదు. ఇప్పుడు అమరరాజా వంతు వచ్చింది.

అమరరాజా కంపెనీ.. అమరాన్ బ్రాండ్‌తో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తుంది. ఈ సంస్థ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. చిత్తూరు జిల్లాకు పారిశ్రామికంగా గుర్తింపు తెచ్చిన సంస్థ అమరరాజా. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. గతంలో ఇచ్చిన భూములంటూ కొన్నింటిని వెనక్కి తీసుకునేందుకు జీవో ఇచ్చింది. అయితే కోర్టులో నిలబడలేదు. ఇప్పుడు కాలుష్య నియంత్రణ పేరుతో.. ఫ్యాక్టరీలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలపై అమరరాజా కూడా స్పందించింది. తాము అన్ని రకాల పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నామని…వాటిపై తగినంత పెట్టుబడులు పెట్టామని కూడా వివరణ ఇచ్చింది.

అయితే కొన్నాళ్లుగా అమరరాజాను ప్రభుత్వం టార్గెట్ చేసుకున్న విధానం చూస్తే…. అసలు కారణాలు వేరే అని అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇలాంటివి రాష్ట్ర పెట్టుబడుల వాతావరణాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీస్తాయని.. పారిశ్రామికవేత్తలు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏపీ సర్కార్‌కు ఇవేమీ పట్టడం లేదు. పరిశ్రమలను ఆకర్షించకపోగా.. ఉన్న వాటిని కూడా… రాజకీయ కారణాలతో తరిమేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close