కబ్జాలు కట్టుకథలు.. అందరి జాతకాలు తెలుసు : ఈటల

భూకబ్జా దారుడు అంటూ కొన్ని చానల్స్‌లో విస్తృతంగా జరిగిన ప్రచారంపై మంత్రి ఈటల రాజేందర్ ఓపెన్ సవాల్ విసిరారు. తన ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని.. ఎన్ని దర్యాప్తు సంస్థలు ఉంటే అన్నింటితోనూ విచారణ చేయించాలి… సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణల సంగతి నిగ్గు తేలిన తర్వాతనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

మీడియా చానళ్లలో వచ్చిన కథనాలపై ఈటల పూర్తి వివరణ ఇచ్చారు. మెదక్ జిల్లాలో నాలుగేళ్ల కిందట హేచరీస్ స్థాపించామని.. దాని కోసం కెనరా బ్యాంక్ వద్ద రూ. వంద కోట్లు రుణం తీసుకున్నామన్నారు. తర్వాత పౌల్ట్రిని విస్తరించడానికి భూముల కోసం ప్రయత్నించినా చుట్టూ అసైన్డ్ ల్యాండ్సే ఉన్నాయన్నారు. ఆ అసైన్డ్ ల్యాండ్స్ నేరుగా తీసుకోవడానికి అవకాశం లేనందున … వారు ప్రభుత్వానికి సరెండర్ చేస్తే పరిశ్రమల శాఖ ద్వారా కేటాయించుకోవచ్చని భావించినట్లుగా చెప్పారు. అయితే అలా జరగలేదని చెప్పారు. ఇప్పుడు వారు చెబుతున్న భూముల్లో ఒక్క ఎకరం కూడా తన స్వాధీనంలో లేదని స్పష్టం చేశారు.

మీడియా సమావేశంలో ఈటల కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీలోనే కుట్ర చేస్తున్నారని ఎక్కడా మాట జారలేదు. అయితే తాను దొరతనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తినని చెప్పుకోవడం ద్వారా.. పరోక్షంగా తానువెనక్కి తగ్గనని హింట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో తన ఆత్మగౌరవంపై దెబ్బకొడితే సహించే ప్రశ్నే లేదన్నారు. అలాగే తన ఆస్తుల గురించి విచారణకు సవాల్ చేసే సమయంలో స్కూటర్‌పై తిరిగే వాళ్లు.. ఒక్క జనరేషన్‌లోనే వందల కోట్లు ఎలా సంపాదించారో … అందరి చరిత్రలూ తెలుసని ప్రకటించారు.

ఓ వర్గం మీడియాలో తనపై మూకుమ్మడిగా ఒకే రకమైన కథనాలు రావడంపై ఈటల మండిపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని కుట్రతో దెబ్బతీసే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ చానళ్లన్నింటినీ పెయిడ్ మీడియాగా అభివర్ణించారు. తాను నయీం లాంటి వాడికే భయపడలేదని.. ఇప్పుడు.. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన కులంపై వస్తున్న విమర్శలను కూడా ఈటల ప్రస్తావించారు. తాను ముదిరాజ్ బిడ్డనని.. తన భార్య రెడ్డి అయితే.. తన కుమారుడికి కూడా రెడ్డి అని పెట్టుకున్నామన్నారు. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close