డాక్టర్ కామర్స్.. కరోనా స్పెషలిస్ట్..!

కామర్స్ చదివి వైద్యం చేస్తానని.. అది కూడా కరోనాను క్షణాల్లో తరిమికొట్టే వైద్యం చేస్తానంటూ పిటిషన్ వేసిన కోల్‌కతాకు చెందిన సురేష్ షా అనే వ్యక్తికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం రూ. వెయ్యి జరిమానా విధించింది. నిజానికి అప్పటికే అతను కోల్‌కతాలో వైద్యం ప్రారంభించేశారు. అధికారులు కేసులు పెట్టడంతో న్యాయపోరాటం ప్రారంభించారు. కోల్‌కతా హైకోర్టులో వైద్యం చేస్తానంటూ పిటిషన్ వేశారు. అక్కడ కొట్టి వేయడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.

కరోనాకు మందులేక డాక్టర్లు, సైంటిస్టులు తలపట్టుకుంటుంటే.. కామర్స్‌ చదివి మందులు ఎలా ఇస్తావంటూ ప్రశ్నించిన సీజేఐ రమణ ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. దానికి ఆయన వద్ద సమాధానం లేదు. పిటిషనర్ తీరుపై సీజేఐ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పది లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది అయితే తాను నిరుద్యోగినని.. తన వద్ద అంత సొమ్ము లేదని.. చెల్లించలేనని మొరపెట్టుకున్నాడు. తాను టీచర్‌నని.. ఇప్పుడు ఉద్యోగం కూడా లేదని.. వెయ్యి రూపాయలు అయితే కట్టగలనని విన్నవించుకున్నాడు. దాంతో వెయ్యి జరిమానా విధించిన సుప్రీంకోర్టు.. ఆ మొత్తాన్ని కోల్ కతా లీగల్ సర్వీసెస్ అధారిటీకి జమ చేయాలని ఆదేశించింది.

చదివింది కామర్స్ అయినా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నసురేష్ షా.. ధైర్యంగా హైకోర్టు.. సుప్రీంకోర్టు వరకూ వచ్చి.. తాను వైద్యం చేస్తానంటూ వాదించడం ఆసక్తికరంగా మారింది. అయితే సురేష్ షా లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ఉన్నారు. తాము చదివిన చదువుకు సంంబధం లేకపోయినా ఇష్టం వచ్చినట్లుగా కరోనాకు వైద్యం చేయడం.. వైద్య పద్దతులను సూచిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తున్నారు. సీజేఐ ఎన్‌వీ రమణ ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల ఇలాంటి వాటికి తెర పడుతుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close