మెట్రో రైల్‌లో ప్రయాణించిన చంద్రబాబు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెట్రో రైల్ పనితీరును స్వయంగా తెలుసుకున్నారు. నిన్న ఢిల్లీలో మెట్రోరైల్‌లో ప్రయాణించారు. నిన్న సిస్కో కంపెనీ ప్రతినిధులతో సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి, ఆ భేటీ ముగిసిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళటానికి మెట్రో ఎక్కారు. కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి మెట్రో ప్రయాణం చేశారు. ఆ ప్రయాణం ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సిస్కో ఛైర్మన్‌తో జరిపిన భేటీలో విశాఖపట్నంలో సిస్కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దీనికి సిస్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. ఈ భేటీ తర్వాత ముఖ్యమంత్రి కొందరు పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశమయ్యారు. అక్కడనుంచి ముంబాయి వెళ్ళి మేకిన్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

‘మిరాయ్’ నుంచి మ‌రో స‌ర్‌ప్రైజ్‌

'హ‌నుమాన్‌' త‌ర‌వాత తేజా స‌జ్జా నుంచి వ‌స్తున్న సినిమా 'మిరాయ్‌'. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవ‌లే టీజ‌ర్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లోని షాట్స్,...

ఓటమి భయం… ఏపీలో వైసీపీ మళ్లీ ఫ్యాక్షన్ పాలిటిక్స్..!?

ఏపీలో మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఏమైనా ప్లాన్ చేస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ అనుకూలురుగా ముద్రపడిన అధికారులను ఈసీ మార్చేస్తుండటంతో జగన్ రెడ్డి దిక్కితోచని...

తీన్మార్ మల్లన్న స్టైలే వేరు !

వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close