“నిపుణులు” ఇప్పటికీ అమాయకులుగానే కనిపిస్తున్నారా..!?

భారతదేశంలో ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఉన్నాయి. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు కానీ… అంత కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా బారిన పడుతున్న ప్రజలకు కనీసం ఆక్సిజన్ అందించలేని దౌర్భాగ్య పరస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని.. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే నిపుణుల కమిటీ హెచ్చరించింది. అయితే ఆ నిపుణుల్ని అమాయకుల కేటగిరి కింద జమ చేర్చేసిన కేంద్రం లైట్ తీసుకుంది. ఫలితంగా ఇండియా ఇప్పుడు కరోనా గుప్పిట్లో చిక్కుకుంది. ఇప్పుడు కూడా కేంద్రం మేలుకున్నట్లుగా కనిపించడం లేదు.

దేశ ప్రజల్ని కాపాడాలంటే.. ఒక్కటే మార్గమని.. అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ అంటోనియో ఫౌచి దగ్గర్నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరకూ అందరూ సూచనలు.. సలహాలు ఇస్తున్నారు. కానీ కేంద్రం వారంతా అమాయకులన్నట్లుగా చూస్తూ… లాక్ డౌన్ లేదు ఏమీ లేదని స్పష్టం చేస్తోంది. కేంద్రంలో ఉన్న కరోనా విస్తృతి.. లక్షల మంది ప్రాణాలను తీయబోతోందని.. దీనిని వీలైనంత వరకూ తగ్గించడానికి మార్గం లాక్ డౌన్ మాత్రమేననని.. ఆంటోనియా ఫౌచీ చెబుతున్నారు. ఆయన మార్గంలోనే ఇతర విదేశీ నిపుణులు సలహాలిచ్చారు. ఎయిమ్స్ చీఫ్ గులేరియా కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా అదే సలహా ఇచ్చారు.

నిజానికి లాక్ డౌన్ విధించడం ప్రజలకు మాత్రమే… భారత్ వైద్య వ్యవస్థకు కూడా మంచిది . లేకపోతే… ఆ వ్యవస్థలో కీలక వ్యక్తులు.. కరోనాకు బలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదే జరిగితే.. కొన్ని తరాల పాటు.. భారత ప్రజలు నాణ్యమైన వైద్యం కోసం… అల్లాడిపోవాల్సి ఉంటుంది. అయితే మొదటి లాక్ డౌన్ సమయంలో వచ్చి పడిన ఆర్థిక నష్టం ముందు మరే నష్టమూ.. పెద్దది కాదని అనుకుంటోంది. ఎంత మంది ప్రాణాలైనా పోనీ.. వైరస్ ఎంతయినా విజృంభించనీ… ఆర్థిక వ్యవస్థ మాత్రం గాడిన ఉండాలని.. కేంద్రం కోరుకుంటోంది. అందుకే … లాక్ డౌన్ విధించాలన్న సలహాలిస్తున్న వారందర్నీ… లైట్ తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close