‘ఏప్రిల్ 15 నుంచి రు.251 ఫోన్‌ల డెలివరీ’

హైదరాబాద్: కారుచవకగా మొబైల్ ఫోన్ అంటూ జాతీయంగా, అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్ సంస్థ యజమాని మొహిత్ గోయెల్ తనపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించారు. రు.251లకు ఫోన్‌ను అందించటమే కాకుండా, దానిపై రు.31 లాభం కూడా గడిస్తానని చెప్పుకొచ్చారు. నొయిడాలోని తమ కార్యాలయంపై పోలీసులు, ఐటీ అధికారుల సోదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు తనను వెంటాడుతున్నారని, తానేమి తప్పు చేశానని ప్రశ్నించారు. ఏప్రిల్ 15 నుంచి డెలివరీ ఇస్తానని, జూన్ 30 నాటికి డెలివరీలు పూర్తిచేస్తానని నమ్మబలికారు. తమదేమీ రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే సంస్థ కాదని చెప్పారు. వినియోగదారుల సొమ్మును ఎస్క్రో ఎకౌంట్‌లో ఉంచుతామని అన్నారు. 7 కోట్ల రిజిస్ట్రేషన్‌లు జరిగాయని, ఫస్ట్ బ్యాచ్‌లో 25 లక్షల యూనిట్‌లకు మాత్రమే ఆన్ లైన్ బుకింగ్స్ తీసుకుంటున్నామని, మరో 25 లక్షలను ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్‌లద్వారా అమ్ముతామని చెప్పారు. మరోవైపు కేంద్ర టెలికామ్ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ రు.251 సెల్ ఫోన్ ఆఫర్‌పై దర్యాప్తు జరపమని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ విభాగం కార్యదర్శి అరుణాశర్మకు ఆదేశాలిచ్చారు. బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్యా ఈ ఆఫర్‌పై రాసిన లేఖపై స్పందిస్తూ మంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. రు.251లకు మొబైల్ ఫోన్ అందించటం సాధ్యం కాదని, ఈ ఆఫర్ వెనకు దురుద్దేశ్యాలు ఉన్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close