చీఫ్ జస్టిస్‌కు వెల్కం.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా..!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ .. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు అటు విమానాశ్రయంలోనూ.. ఇటు ఆయన బస చేసే రాజ్‌భవన్‌లోనూ స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున వీఐపీలు తరలి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సిన వారే కాకుండా.. . అధికార బాధ్యతల్లో ఉన్న పలువురు మంత్రులు.. ఉన్నతాధికారులు తరలి వెళ్లారు. ఓ రకంగా మొత్తం అధికారవర్గంలో సీజేఐ ఎన్వీ రమణ రాక సందడి కనిపించింది. రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అయితే.. తెలుగు వ్యక్తి చాలా ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు సీజే అవడం… కారణంగా ఈ ఉత్సాహం కనిపించిందని అనుకోవచ్చు.

అయితే.. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అంశం చీఫ్ జస్టిస్ నేరుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రాలేదు. ఆయన మొదటగా ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని అక్కడ్నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ ఏపీలో ఎక్కడా హడావుడి కనిపించలేదు. ప్రోటోకాల్ ప్రకారం కూడా.. వీఐపీలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… సీజేఐ వచ్చే సమయానికంటే ముందుగానే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత అమరావతి వచ్చారు.

రెండు చోట్ల ఆహ్వానాలు.. స్వాగతాలు రెండు రోజుల్లోనే జరగడంతోనే కంపేరిజన్ ఎక్కువగా వస్తోంది. ఈ విషయంలో ఎన్వీ రమణ సీజేఐగా ఖరారు కాక ముందు జరిగిన పరిణామాలను కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఎన్వీ రమణ సీజేఐ కాకుండా… ఓ వైపు జడ్జి రామకృష్ణ వైపు నుంచి ఆరోపణలు చేయించడానికి మరో వైపు.. స్వయంగా సీఎం జగన్ ఆరోపణలు చేస్తూ లేఖ రాయడాన్ని కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్‌కు ఇష్టం లేనందునే… తెలంగాణ స్థాయిలో స్వాగతాలు దక్కలేదని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close