విద్యామంత్రిపై “ఫెయిల్” ముద్ర వేయడానికే పరీక్షల గేమ్..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలను మానసిక క్షోభకు గురి చేస్తోంది. ఇదిగో పరీక్షలు.. అదిగో పరీక్షలు అంటూ ఎప్పటికప్పుడు కొత్త టెన్షన్లకు గురి చేస్తోంది. మానసికంగా ప్రశాంతంగా ఉండనీయడం లేదు. సీబీఎస్‌ఈ నుంచి తెలంగాణ సర్కార్ వరకూ అన్ని విద్యాబోర్డులు.. పరీక్షలను రద్దు చేసి.. మార్కులను.. గ్రేడ్లను.. జీపీఏలను ఇచ్చే ప్రక్రియ లో ఉన్నాయి. తదుపరి విద్యా సంవత్సరంపై దృష్టి పెట్టాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం.. పరీక్షలు నిర్వహిస్తామనే చెబుతోంది. రెండు రోజుల నుంచి పరీక్షల తేదీలతో సహా.. మీడియాకు లీక్ చేసిన ప్రభుత్వ వర్గాలు.. గురువారం ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

చివరికి జనగ్మోహన్ రెడ్డికి చెందిన అధికారిక మీడియాలో కూడా.. ఈ అంశంపై వార్తలు వచ్చాయి. వచ్చే నెల ప్రారంభంలో ఇంటర్.. చివరిలో టెన్త్ పరీక్షలు పెడతారని.. సెప్టెంబర్ మొదటి వారంలో టెన్త్ రిజల్ట్స్ ఇస్తామని లీకులు ఇచ్చారు. దీంతో విద్యాశాఖపై సీఎం సమీక్ష తర్వాత అధికారిక ప్రకటన వస్తుందేమోనని ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశ ఎదురయింది. సమీక్ష ముగిసిన తర్వాత మంత్రి సురేష్.. అసలు పరీక్షల గురించి ముఖ్యమంత్రితో చర్చించలేదని చెప్పుకొచ్చారు. దీంతో విద్యార్థులు హతాశులయ్యారు.

అసలు పరీక్షలు ఉంటాయా.. ఉండవా.. అనే టెన్షన్ ఓ వైపు.. పెడితే ఎప్పుడు పెడతారు.. ఎలా పెడతారు అనే ఆందోళన మరో వైపు.. వారిని ఇబ్బందికి గురి చేస్తోంది. పరీక్షలపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికీ సురేష్ కబుర్లు చెబుతున్నారు. పసివాళ్ల పట్ల.. పరీక్షల విషయంలో ఉండే వారి ఆందోళనల పట్ల కనీస పట్టింపు లేకుండా… వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఇలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేదు.

మంత్రి సురేష్‌ను ఈ విషయంలో వ్యూహాత్మకంగా బ్యాడ్ చేస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలో వినిపిస్తోంది. పరీక్షల విషయంలో అత్యుత్సాహంతో ఆయన ప్రకటనలు చేయడం.. వాటిని మళ్లీ ఆయనే కాదనడం.. పదే పదే జరుగుతోంది. దీంతో ఆయను కన్ఫ్యూజన్ మంత్రిగా విపక్షాలు విమర్శిస్తున్నాయి. పై నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే సురే్ష్ మాట్లాడుతారని.. సొంత ఆలోచనలు ఉండవని.. ఆయనను కావాలనే అలా చేస్తున్నారన్న చర్చలు వైసీపీలో జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close