విశాఖలో పీవీ సింధుకు ఉచితంగా రెండెకరాలు..!

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఏపీ సర్కార్ భారీ నజరానా ఇచ్చింది. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడెమీ పెట్టేందుకు రెండు ఎకరాలను ఉచితంగా ఇచ్చింది. విశాఖ రూరల్‌లోని చిన్నగదిలి అనే గ్రామంలో రెండు ఎకరాలను కేటాయిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూమి ప్రస్తుతం పశు సంవర్థక శాఖ అధీనంలో ఉంది. వారి దగ్గర్నుంచి యువజన, క్రీడా శాఖకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖ నుంచి సింధుకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రెండు ఎకరాల స్థలంలో కనీసం రూ. ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి.. బ్యాడ్మింటన్ అకాడమీ.. అలాగే.. స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని నిబంధనలు పెట్టారు. అలాగే అకాడ‌మీ అవ‌స‌రాల‌ కోస‌మే భూమి ఉప‌యోగించాల‌ని క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల‌కోసం వాడ‌కూడ‌ద‌ని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అకాడ‌మీ ద్వారా ప్రతిభ ఉన్న పేద‌వారికి లాభాపేక్ష లేకుండా శిక్షణ ఇవ్వాల‌ని సూచించింది.

మామూలుగా అయితే ప్రభుత్వం ఎప్పుడూ ఉచితంగా ఇవ్వదు. కానీ ఏపీ సర్కార్ అనూహ్యంగా ఉచితంగా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఎంతో కొంత విలువ కట్టి ఉంటే… ఆ స్థలం విషయంలో పీవీ సింధుకు యాజమాన్య హక్కులు వచ్చి ఉండేవి. పూర్తి ఉచితంగా ఇస్తున్నందున ప్రభుత్వం ఎప్పుడైనా సరే వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. స్థలం కేటాయింపు విషయంలో ఇచ్చిన నిబంధనలు పాటించలేదని ఒక కారణం చెప్పి స్వాధీనం చేసుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం చూస్తే.. ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి.. పీవీ సింధు అకాడమీ ఏర్పాటు చేసి.. ఎవరి వద్దనైనా ఫీజు వసూలు చేసినా .. నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అకాడమీ కోసం స్థలం కావాలని పీవీ సింధు గత ప్రభుత్వాన్ని కోరింది. అమరావతిలో ఐదెకరాలు ఇవ్వాలని అప్పట్లో చంద్రబాబు నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రక్రియ సాగుతూండనే ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వానికి పీవీ సింధు ప్రతిపాదనలు నచ్చాయి. అయితే అమరావతిలో కాకుండా తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకుంటున్న విశాఖలో ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close