వైఎస్‌ను అన్ని మాటలంటున్నా వైసీపీలో చురుకులేదేంటి..!?

వైసీపీ నేతల వీక్‌నెస్‌ను టీఆర్ఎస్ నేతలు బాగా పట్టుకున్నారు. తాము ఏమన్నా నోరు మెదపలేని పరిస్థితి వైసీపీకి ఉందని.. వారికి అర్థమైపోయింది. దాంతో వారు నేరుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. తాము మహానేత అని గొప్పగా చెప్పుకుంటూ పార్టీకి మూల పురుషుడిగా ప్రచారం చేసుకుంటున్న వైఎస్ఆర్‌పై .. టీఆర్ఎస్ నేతలు అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నా.. నోరు మెదపడం లేదు. వీరి వీక్‌నెస్ ను పట్టిన టీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని కొత్త బిరుదు ఇచ్చారు.

ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని.. మండిపడ్డారు. పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణమని కొత్తగా ఆరోపించారు. పార్టీలో తొక్కేస్తున్న సమయంలో.. ఓ కార్యక్రమంలో వేదికపైకి ఆహ్వానించనందుకు.. గుండెపోటు వచ్చి పీజేఆర్ చనిపోయారని శ్రీనివాస్ గౌడ్ అంటున్నారు. అంతే గాక వైఎస్ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయని.. ఇష్టం వచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారని మండిపడ్డారు. మరి అంత వ్యతిరేకత ఉంటే.. జగన్‌తో ఎందుకు సత్సంబంధాలు పెట్టుకున్నారంటే శ్రీనివాస్ గౌడ్ విచిత్ర వాదన వినిపిస్తున్నారు.

తండ్రి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామని చెప్పుకొచ్చారు. వైఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు.. వైసీపీ నేతలు ఇస్తున్న కౌంటర్ పేలవంగా ఉంటోంది. చర్చించడానికి జగన్ సిద్ధమన్న మాటలను మంత్రులు అదే పనిగా చెబుతున్నారు. కానీ ఈ చర్చల ప్రక్రియ నుంచి తిట్ల దశకు వచ్చింది. తమ పార్టీ మూల పురుషుడ్ని టీఆర్ఎస్ నేతలు అనుచితంగా తిడుతున్నా.. గట్టిగా కౌంటర్ ఇవ్వలేని దుస్థితికి వైసీపీ చేరింది. ఈ పరిస్థితి వైసీపీ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. ఎవరూ తెలంగాణ రాష్ట్ర సమితిపై నోరెత్తడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close