నమితకు టీటీడీ మర్యాదలు సరిపోలేదా..!?

తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు పరిస్థితులేమీ బాగోలేదని నటి నమిత.. ఆమె భర్త మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులందరూ భయం భయంగా ఉన్నారని.. అసలు ఎక్కడా ఓ పద్దతి పాడు లేకుండా పోయిందని మండిపడ్డారు. అంతటితో ఊరుకోలేదు… గతంలో పని చేసిన అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో జేఈవోగా శ్రీనివాసరాజు ఉండేవారు. ఆయనను గుర్తు చేసుకున్న నమిత ఆయన హయాంలో తిరుమలలో అన్ని వ్యవహారాలు స్మూత్‌గా జరిగిపోయేవని చెప్పుకొచ్చారు. సహజంగానే సెలబ్రిటీలు… ఏమైనావ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇస్తే హైలెట్ అవుతాయి. అలా నమిత స్టేట్‌మెంట్ కూడా హైలెట్ అయిపోయింది.

తిరుమలకు వచ్చే సెలబ్రిటీలు …తమకు సేవలు సరిగ్గా అందకపోతే… విమర్శలు చేయడం సినీ తారలకు కామన్ అయిపోయింది. వాళ్ల మాటలకు మీడియా కూడా అటెన్షన్ ఇస్తుంది కాబట్టి.. టీటీడీ వర్గాలు కూడా వీలైనంత వరకూ ఆ సెలబ్రిటీలకు మర్యాదలు చేసి పంపుతూ ఉంటారు. కానీ అన్నీ సార్లు సాధ్యం కాదు. ఒక్కో సారి ఒక్కో సెలబ్రిటీ అతిగా ఊహించుకుని .. సేవలు అందలేదని విమర్శలు ప్రారంభిస్తారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు నమిత విషయంలో టీటీడీ అధికారులకు ఎదురయిందని అంటున్నారు. అయితే నమితకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇచ్చి దర్శనం చేయించామని.. అయినా ఆమె ఎందుకు అసంతృప్తి వ్యక్తంచేసిందో తెలియడం లేదని టీటీడీ వర్గాలు గొణుక్కుంటున్నాయి.

టీటీడీకి ప్రస్తుతం పాలక మండలి లేదు. ఈవో, డిప్యూటీ ఈవోలతోనే స్పెసిఫైడ్ అధారిటీ ఉంది. దీంతో టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు పని చేయడం లేదు. వారు ఉండి ఉంటే.. ఎవరో ఒకరి సిఫార్సుతో నమిత వచ్చేవారేమో.. అప్పుడు టీటీడీ వర్గాలు ఆమెకు తగినంత ప్రాధాన్యత ఇచ్చి.. దర్శనం చేయించేవేమో కానీ.. ఇప్పుడు మాత్రం… ఆమె సాధారణ దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ఆలయ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోలేదంటున్నారు. అందుకే ఆమెకు కోపం వచ్చి.. వ్యతిరేక స్టేట్‌మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ : రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలిసుల నోటిసులు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close