క‌త్తిమ‌హేష్ క‌న్నుమూత‌

న‌టుడు, సినీ విమ‌ర్శ‌కుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తి మ‌హేష్ తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌త్తిమ‌హేష్ కొద్దిసేప‌టి క్రితం తుది శ్వాస విడిచారు. రెండు వారాల క్రితం నెల్లూరు ద‌గ్గ‌ర జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో క‌త్తిమ‌హేష్‌కి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న కంటి చూపు కోల్పోయార‌ని వార్త‌లొచ్చాయి. అయితే… క‌త్తిమ‌హేష్ కోలుకుంటున్నారని, ఆయ‌న త్వ‌ర‌లోనే సంపూర్ణ ఆరోగ్యంతో బ‌య‌ట‌కు వ‌స్తార‌ని స‌న్నిహితులు చెబుతూ వ‌చ్చారు. కొద్ది రోజులుగా క‌త్తి మ‌హేష్ ఆరోగ్యం గురించి ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దాంతో క‌త్తిమ‌హేష్ ఆరోగ్యం కుదుట‌ప‌డింద‌ని అనుకున్నారంతా. అంత‌లోనే… ఇప్పుడు మ‌ర‌ణ‌వార్త వినాల్సివ‌చ్చింది. విమ‌ర్శ‌కుడిగా చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన క‌త్తి మ‌హేష్ `పెస‌రెట్టు` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారారు. కొన్ని చిత్రాల్లోనూ న‌టించారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితంపై ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు విమర్శ‌ల‌కు దారి తీశాయి. హిందుత్వంపై, రాముడిపై క‌త్తి చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టిన మ‌హేష్‌… త‌న‌కంటూ ఓ అభిమాన వ‌ర్గాన్ని సృష్టించుకున్నారు. వైకాపా మ‌ద్ద‌తుదారుడిగానూ ఆ పార్టీ త‌ర‌పున మాట్లాడారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close