వీర్రాజుకు ఏపీ ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి.. ఆ పార్టీ నాయకులకు ఓ మాదిరిగా కూడా కనిపిస్తున్నట్లుగా లేరు. కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని కూడా అదంతా అబద్దం నమ్మద్దు.. అలాంటిదేమీ జరగదని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను వంద శాతం అమ్మడానికి ప్రక్రియను ట్రాక్ ఎక్కించిన కేంద్రం… మరో నాలుగైదు నెలల్లోనే పని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇదంతా బహిరంగరహస్యం.. అయితే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం.. అబ్బే అసలు స్టీల్ ఫ్యాక్టరీ అమ్మే ఉద్దేశం కానీ.. అమ్మాలన్న ఆలోచన కానీ కేంద్రానికి లేదని .. ప్రైవేటు పరం అయ్యే చాన్స్ లేదని చెప్పుకొస్తున్నారు.

ఆందోళలన్నీ పని లేక చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. సోము వీర్రాజు మాటలు.. స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు సామాన్యులను కూడా విస్మయం కలిగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని మొదట్లో ప్రగల్భాలు పలికి.. ఢిల్లీకి వెళ్లి.. నాలుగైదు రోజులు గడిపి.. వచ్చారు కానీ.. ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకురాలేకపోయారు.పైగా వచ్చిన తర్వాత ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాలు చెప్పకుండా… జరుగుతున్ననిజాన్ని కూడా తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రస్తుతం ఏం జరిగినా.. జరగలేదని చెబితే.. నమ్మేసే స్థాయిలో ప్రజల రాజకీయ పార్టీలపై భక్తి.. మూఢత్వం పెంచుకున్నారని.. పార్టీని నమ్మని వాళ్లు ఏం చెప్పినా.. చేసినా నమ్మరన్న అభిప్రాయానికి వచ్చేసినట్లుగా ఉన్నారు. ఇలా అడ్డగోలుగా వాదిస్తూ… ప్రజల్ని మోసం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. వీర్రాజు తీరుపై ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. కానీ మొదటి నుంచి బీజేపీ నేతల తీరు అంతేనని.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతి చిన్న విషయాన్ని ఆరోపణలు చేసి హడావుడి చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడమే దానికి సాక్ష్యమని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close