వివేకా కేసులో కొత్తగా “లేఖ” ట్విస్ట్..!

సీబీఐ అధికారులు నెల రోజులకుపై ఏదైనా కేసులో విచారణ జరిపారో లేదో కానీ… వైఎస్ వివేకా హత్య కేసులో మాత్రం.. జరుపుతూనే ఉన్నారు. రోజూ.. డ్రైవర్, వాచ్‌మెన్లను పిలిపించుకుంటున్నారు. ప్రతీ రోజూ వారేనా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు.. వివేకాతో సన్నిహిత సంబంధాలు.. వ్యాపార సంబంధాలు ఉన్న ఇతరుల్ని పిలిపించి ప్రశ్నిస్తున్నారు. అంతే తప్ప…అంతకు మించి ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. సీబీఐ అధికారుల తీరుపై కడపకు చెందిన సుబ్బారాయుడు అనే లాయర్.. కేంద్ర గ్రివెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ విచారణ ఏమీ జరగడం లేదని .. అంతా గూడుపుఠాణీ చేస్తున్నారన్న అర్థంలో ఆయన ఫిర్యాదు చేయడంతో… కలకలం రేగింది.

సీబీఐ సెంట్రల్ గ్రీవెన్స్ సెల్‌కు ఈ ఫిర్యాదు వెళ్లడంతో.. అక్కడ అధికారులు స్పందించారు. దర్యాప్తు అధికారులను పురోగతిపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో.. వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కూడా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఆమె… పులివెందులలో పలువురు పోలీసు అధికారుల్ని కలిశారు. మళ్లీ చెప్పాలనుకున్నది చెప్పారు. అయితే అసలు లాయర్ సుబ్బారాయుడు రాసిన లేఖలో ఏముందో.. మాత్రం స్పష్టత లేదు. కానీ.. ఆ లేఖ దర్యాప్తులో కీలకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సీబీఐ అధికారులు ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారో…పులివెందులలో కూడా… చర్చనీయాంశం అవుతోంది. బహిరంగ రహస్యమైన కేసును చేధించడానికి .. నెలలతరబడి సీబీఐ అధికారులు దర్యాప్తు చేయడం అంటే.. ఆ సంస్థ సామర్థ్యంపైనే అనుమానాలు ఏర్పడతాయని అంటున్నారు.

అయితే.. ఈ కేసులో ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో కానీ సీబీఐ అధికారులు మాత్రం ప్రశ్నించిన వారినే ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్, వాచ్‌మెన్ చుట్టూనే వారు తిరుగుతున్నారు.. వారిని తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరికి.. ఆ కేసును వారిదగ్గరే ఆపేస్తారేమోనన్న సెటైర్లు … పులివెందులలోనే వినిపిస్తున్నాయి. మొత్తానికి వివేకా హత్య కేసులో తమపై కూడా మచ్చ పడకుండా… సీబీఐ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close