న్యాయ రాజధానిలో “రాష్ట్ర మానవ హక్కుల కమిషన్”..!

అమరావతి నుంచి రాజధానిలోని పలు విభాగాలను తరలించడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయేమో కానీ.. కొత్తవి ఏర్పాటు చేయడానికి ఎలాంటి సమస్యలు లేవు. ఏపీ ప్రభుత్వానికి ఈ లాజిక్ బాగా నచ్చింది. వెంటనే కర్నూలు న్యాయరాజధానిలో ఓ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అవకాశం చిక్కింది. అంతే.. పాదరసంలా కదిలింది. కర్నూలులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది భవనాన్ని వెదుకుతోంది. త్వరలో.. ఖరారు చేసి.. కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ప్రారంభించబోతున్నారు.

ప్రస్తుతం మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్‌లో ఉంది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ పక్కరాష్ట్రంలో ఎందుకు ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ మన రాష్ట్రంలోనే ఉండి తీరాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనే హక్కుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చింది. హక్కుల కమిషన్‌తోపాటు లోకాయుక్త వంటి సంస్థలు రాష్ట్రంలోనే ఉండాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వానికి ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే ప్రభుత్వం చురుగ్గా ఆలోచించింది.అది న్యాయపరమైన వ్యవస్థ కాబట్టి.. దాన్ని కర్నూలులో పెట్టాలని డిసైడయింది.

కర్నూలు న్యాయరాజధానిగా హైకోర్టును పెట్టాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆ నిర్ణయం పై ఇప్పుడల్లా క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఈ లోపు కొన్ని న్యాయపరమైన శాఖలను అక్కడకు పంపాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. తరలింపుపై కోర్టు కేసులు ఉన్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి ఏపీలో ఎక్కడైనా మానవ హక్కుల కమిషన్‌ను పెట్టుకోవచ్చు కాబట్టి… ప్రభుత్వం కూడా కర్నూలును ఎంచుకుంది. హైకోర్టు కూడా..దీనిపై తప్పు పట్టే అవకాశాలు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ దిశగా ముందడుగు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌గా కొన్నాళ్ల క్రితం విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మందాట సీతారామమూర్తి పేరును ప్రకటించారు. కార్యాలయం లేకపోవడంతో ఆయన ఇంట్లోనే బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు విధుల కోసం ఆయన కర్నూలు వెళ్లాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమిదే విజయమని వైసీపీ అభ్యర్థుల బెట్టింగులు..!!

స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా...వైసీపీ తరఫున...

ఓట్లు ఎలా వస్తాయో అలానే మోదీ ప్రచారం !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ...

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close