రూ. 2వేల కోట్లకు ఎమ్మెల్యే పదవి ఇచ్చేస్తారట..!

తెలంగాణ సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎన్నికలను టార్గెట్ చేసుకుని అదేపనిగా ఆ నియోజకవర్గానికి వరాల మీద వరాలు ప్రకటిస్తూండటంతో ఇతర నియోజకవర్గాల నేతలకు మండిపోయేలా చేస్తోంది. టీఆర్ఎస్ నేతలు ఎలాగూ నోరెత్తలేరు. కొంత మంది విపక్ష నేతలు కూడా.. మాకెందుకులే అన్నట్లుగా ఉంటున్నారు. అయితే.. తమ నియోజకవర్గంలో ఏ పనులూ చేయించలేకపోతున్నామని… ఫీలవుతున్న కొంత మంది మాత్రం నోరు విప్పుతున్నారు. అలాంటివారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.

హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ రూ. రెండువేల కోట్లు కేటాయించారని.. అదే రెండు వేల కోట్లు మునుగోడుకు కూడాకేటాయిస్తే.. తాను ఎమ్మెల్యే పదవిని వదిలేస్తానని ప్రకటించారు. ఉపఎన్నికలు వచ్చిన నియోజకవర్గానికి నిధుల వరదేనని సోషల్ మీడియాలో కామెంట్లు నడుస్తున్నాయి. ఈ సమయంలో.. తాను రాజీనామా చేస్తే వచ్చే ఉపఎన్నిక కోసమైనా. కేసీఆర్ .. తన నియోజకవర్గానికి రూ. రెండు వేల కోట్లు కేటాయిస్తారనేది రాజగోపాల్ రెడ్డి అంచనాగా చెబుతున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటి నుండి.. తన నియోజకవర్గంలో చిన్న అభివృద్ధి పని కూడా చేయించలేకపోయానని.. రాజగోపాల్ రెడ్డి బాధపడుతున్నారు.

ఇప్పుడు ఎవరూ అడగకపోయినా… కేవలం ఉపఎన్నిక కారణంగానే… హుజూరాబాద్‌కు నిధుల వరద పారుతూండటంతో కోమటిరెడ్డికి అసంతృప్తి కలిగిస్తోంది. అదేసమయంలో ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి… నిధుల లేకపోవడం వల్లే.. కేసీఆర్ ఇవ్వకపోవడం వల్లే మునుగోడులో ఏ పనీ చేపట్టలేకపోయినట్లుగా చెప్పుకోవడానికి రాజగోపాల్ రెడ్డికి ఇదో మంచి అవకాశంలా కనిపించిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన రాజకీయం తాను ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close