బ్యాంకులకు జాగ్రత్తలు చెబుతున్న రఘురామ..!

బ్యాంకులకు రూ. ఎనిమిది వందల కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రఘురామకృష్ణరాజు ఇప్పుడు ఆ బ్యాంకులకే క్లాస్‌ తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వానికి బ్యాంకులు అప్పులు ఇచ్చేటప్పుడు వెనుకా ముందూ చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. రోజువారీ ప్రెస్‌మీట్లలో భాగంగా ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి చేస్తున్న అప్పులు.. అందు కోసం చేస్తున్న ప్రయత్నాలపై మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు రుణాలిస్తున్నాయని .. తర్వాత ఇబ్బంది పడతారని రఘురామకృష్ణరాజు బ్యాంకర్లను హెచ్చరించారు. నిబంధనలకు విరద్ధంగా రుణాలు ఇస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వం స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో చేసిన అప్పులు కాకుండా.. తాజా ఎడ్యుకేషన్ కార్పొరేషన్ పేరిట రుణాలకు ప్రయత్నిస్తోందని రఘురామ ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు.. కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించరాదని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను స్వాధీనం చేసుకుని ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని కింద ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను చూపి అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ కాలేజీల ఆస్తులు అమ్మితే ఇంకో లక్ష కోట్లు వస్తాయని, దాంతో మరో ఏడాది పాటు నడిపించవచ్చని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు.

రఘురామకృష్ణరాజు రచ్చ బండ ప్రెస్‌మీట్లు పెడుతున్నారని.. వాటిని ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ.. ఏపీ ప్రభుత్వం వాటి వెనుక కుట్ర ఉందని.. రాజద్రోహం కేసులు పెట్టింది. ఆయనను పుట్టినరోజు నాడే అరెస్ట్ చేసి ధర్డ్ డిగ్రీ ప్రయోగించినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి… విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close