సీఎం జగన్‌తో కిషన్ రెడ్డి భేటీ..!

ఆంధ్రప్రదేశ్‌లో జన ఆశీర్వాద్ యాత్ర చేయడానికి విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీకి ఆహ్వానించారు. ముందుగా షెడ్యూల్‌లో లేకపోయినప్పటికీ సీఎం జగన్ ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన తాడేపల్లిలోని జగన్ ఇంటికి వెళ్లారు. ముందుగా ఆయన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మంత్రులు కూడా ఉన్నారు. దర్శనం తర్వాత ఆయన సీఎం ఇంటికి వచ్చారు. ఈ సందర్భంలో కారు ఎక్కుతున్న సమయంలో ఆయన తలకు డోర్ బలంగా తగిలింది. దీంతో నుదుటిపై గాయం అయింది.

అక్కడిక్కడే ప్రాథమిక చికిత్స తీసుకున్న కిషన్ రెడ్డి సీఎంతో భేటీ కోసం తాడేపల్లికి వచ్చారు. సీఎంవో విడుదల చేసిన ఫోటోల్లో కిషన్ రెడ్డి తలకు గాయం కనిపిస్తోంది. కిషన్ రెడ్డికి సీఎం వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వచ్చినందునే మర్యాదపూర్వకంగా ఆహ్వానించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కిషన్ రెడ్డితో కలిసి జగన్ భోజనం చేశారు.

సీఎం జగన్ మర్యాదపూర్వకంగానే ఆహ్వానించారని.. ఇందులో రాజకీయం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగువాడికి పూర్తి స్థాయి కేబినెట్ మంత్రిగా కేంద్రంలో అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారని తెలిపారు. కనకదుర్గమ్మ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ నరేంద్రమోడీకి రెండు కళ్లులాంటివని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అయితే కిషన్ రెడ్డి పర్యటన గురించి తెలిసినా చివరి క్షణంలో కిషన్ రెడ్డిని చివరి క్షణంలో జగన్ ఇంటికి ఆహ్వానించడంపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close