హుజురాబాద్ ఉపఎన్నిక చిన్న విషయం : కేటీఆర్

దళితులకు మాత్రమే కాదు భవిష్యత్‌లో బీసీ, మైనార్టీ,అగ్రవర్ణ పేదల బంధు పథకాలను కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ కార్యవర్గ సభ్యులకు తెలిపారు. టీఆర్ఎస్ భవన్‌లో చాలా కాలం తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణ సాధించుకున్నామని మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామని కేసీఆర్ కార్యవర్గ సభ్యులకు తెలియచేశారు.

సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కార్యవర్గ సమావేశంలో హుజురాబాద్ ఉపఎన్నిక గురించి ప్రస్తావించలేదని.. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ అంశంపై ఆలోచిస్తామన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక చాలా చిన్న విషయమని కేటీఆర్ తేల్చేసారు. ఆ నియోజకవర్గం టీఆర్ఎస్‌కు కంచుకోటని.. ఉపఎన్నికతో ప్రభుత్వం కూలిపోయేదేమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని కేటీఆర్ వ్యాక్యానించారు.దళిత బంధుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలన్నారు.

32 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్‌ అక్టోబరులో ప్రారంభిస్తారని ..సెప్టెంబరు 2న కేసీఆర్‌ చేతుల మీదుగా ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భూమి పూజ చేస్తామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. రెండు దశాబ్దాల్లో అనితర సాధ్యమైన విజయాలను టీఆర్ఎస్ నమోదు చేసిందని.. కేటీఆర్ తెలిపారు. సెప్టెంబరులో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close