బద్వేలు ఉపఎన్నికలకు టీడీపీ రెడీ..!

ఆంధ్రప్రదేశ్‌లో బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగాలన్న విషయం చాలా మందికి గుర్తు లేదు. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మార్చి 26వ తేదీన కన్ను మూశారు. అయితే ఆ స్థానం వైసీపీ కంచుకోట కావడంతో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, బీజేపీ కానీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అందుకే కనీస కసరత్తు లాంటివి కూడా చేసినట్లుగా లేదు. కానీ హఠాత్తుగా టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో పోటీచేసిన ాజశేఖర్ అనే అభ్యర్థినే టీడీపీ తరపున నిలబెడుతున్నట్లుగా ప్రకటించారు. బద్వేలు టీడీపీ వ్వహారాలన్నీ విజయమ్మ చూస్తూంటారు. ఇటీవల ఆమె అంత యాక్టివ్‌గా లేరు. అయినప్పటికీ ఆమెకు ఫోన్ చేసి చంద్రబాబు విషయం చెప్పి అభ్యర్థిని ఖరారు చేశారు.

వైసీపీ తరపున ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య దాదాపు 44 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. వైసీపీ తరుపున వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్ సుధకే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. అయితే ఉపఎన్నికలు కాబట్టి అక్కడ అభివృద్ధి పనులకు సీఎం జగన్ నిధులు మంజూరు చేస్తున్నారు. పలు అభివృద్ధిపనులకు గతంలోనే శంకుస్తాపన చేశారు. తాజాగా బద్వేలును రెవిన్యూ డివిజన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం వచ్చినా తమ ప్రాంతానికి ఏమీ జరగలేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఏర్పడకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటివేమీ ప్రకటించకపోయినా అక్కడ వైసీపీకే భారీ మెజార్టీ వస్తుందన్న అంచనాలున్నాయి.

నిబంధనల ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోతే ఆరు నెలల్లో ఎ్నికలు పెట్టాల్సిఉంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కొన్నాళ్ల కిందట ప్రకటించింది. ఇటీవలే ఉపఎన్నికలపై పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నాదు. ఉపఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయిస్తే.. బద్వేల్‌లో కూడా ఉపఎన్నిక జరగుతుంది. లేకపోతే.. మరికొంతకాలం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close