సీఎంలు సై అంటే కిషన్ రెడ్డి పరిష్కరించేస్తారు..!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జల వివాదాల పరిష్కారానికి సిద్ధంగా ఉంటే తానే చొరవ తీసుకుని చర్చలకు ముందుకు వెళదామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జల వివాదాల పరిష్కారానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ అంశంపై ఆలోచించాలన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. సామరస్యంగా జల వివాదాన్ని పరిష్కరించుకోవాలనని .. కేసీఆర్ జగన్, ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికీ సమస్య పరిష్కారం కోసం తాను పెద్దన్న పోషిస్తాన్నట్లుగా కిషన్ రెడ్డి ప్రకటన చేయడం రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఎలా చూసినా కిషన్ రెడ్డి అటు కేసీఆర‌్ కానీ ఇటు జగన్ స్థాయి కానీ లేని నేత. ఆయనకు కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ ఉండి ఉండవచ్చు కానీ కేసీఆర్, జగన్ ఇద్దరూ ఆయనను గొప్ప పవర్ ఫుల్ నేతగా చూడరు. అలాంటి అవకాశమే లేదు. అయినప్పటికీ కిషన్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకుని తాను ఇద్దరి మధ్య సమస్యను పరిష్కరిస్తానని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం రెండు పార్టీల నేతల్లోనూ ఆశ్చర్యానికి కారణం అవుతోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే సరిపోతుందనే వాదన ఉంది. కానీ ఆ ఇద్దరూ మాట్లాడుకోకపోవడం వల్లనే సమస్య వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ కాదని పెద్దన్నగా భావించి కిషన్ రెడ్డి దగ్గర పంచాయతీ తీర్చుకోవడం అనేదే ఊహకందని విషయం. అపెక్స్ కౌన్సిల్‌లోనేవారి పంచాయతీ తేలలేదు. సుప్రీంకోర్టులో తేల్చుకుందామని డిసైడయ్యారు. అయినా కిషన్ రెడ్డి పెద్దరికాన్ని తనకు తాను ఆపాదించుకుని ఇలా ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. కిషన్ రెడ్డి అంశాన్ని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా లేక లైట్ తీసుకుంటాయా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close