ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి. అతి తక్కువ ఫీజులతో విద్యా సేవ అందిస్తున్నాయి. వీటి వల్ల ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. అయితే ఇప్పుడు వాటిని ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది. వాటికి ఉన్న వేలాది ఎకరాలపై ప్రభుత్వ కన్ను పడిందన్న అనుమానాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే వాటిని ఏమి చేసుకోవడానికైనా హక్కు ప్రభుత్వానికి ఉంటుందని జీవోలోనే ప్రకటించారు.

విజయవాడలోని మాంటిస్సోరి స్కూల్ ను మూసేశారు. ప్రభుత్వానికి అప్పగించడం ఇష్టం లేక అలాగని ప్రైవేటు స్కూల్ తరహాలో నడపలేక మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. అరవై ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్ అది. బాలికల విద్య కోసం శ్రమించిన స్కూల్ అది. అలాంటివి ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం వాటి స్థలాను లాగేసుకోవడం కాబట్టి అధికారులతో ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒత్తిళ్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ప్రభుత్వం బెదిరిస్తోందని హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.

ఎయిడెడ్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటంతో చాలా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడటం లేదు. ప్రభుత్వ ఎయిడ్ లేకపోవడంతో ఆయా విద్యా సంస్థలు నడవడం కూడా కష్టంగా మారింది. ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో వేరేగా ఉంది. ఎలా చూసినా ప్రస్తుతం ఎయిడెడ్ వ్యవహారం విద్యార్థులకు కష్టంగా మారింది. ప్రభుత్వంపై విమర్శలు పెరగడానికి కారణం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close