తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా ప్రచారం చేసింది ఎల్లో మీడియా అని విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అదే ఆలోచన తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది. ప్రత్యేకంగా మటన్ మార్టులు అని పేరు చెప్పకపోయినా మటన్ దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని దాదాపుగా నిర్ణయించారు.

ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు వధశాలలు ఏర్పాటు చేయాలని ఫ్లాన్ చేస్తోంది. వీటిని స్థానిక మటన్ షాపులకు లింక్ చేస్తారు. అక్కడి నుంచి వినియోగదారులు కొనుక్కెళ్లవచ్చు. మటన్ దుకాణాల యజమానులు కూడా ప్రభుత్వం సరఫరా చేసే మటనే అమ్మాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలు ఇప్పటికే రెడీ అయ్యాయి ప్రభుత్వం తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం మేకలు, గొర్రెల యూనిట్లను పెద్ద ఎత్తున లబ్దిదారులకు సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. వాటి వల్ల భారీగా ఉత్పత్తి ఉండనుంది.

తెలంగాణ ప్రజల అవసరాల మేరకే ప్రభుత్వం పంపిణీ చేసిన మేకలు, గొర్రెల పథకం ఉపయోగపడాలని.. ఎక్కువ అయితేనే ఎగుమతి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఆ యూనిట్ల లబ్దిదారులకు మెరుగైన రేట్లు వచ్చేలా చూడటం.. ప్రజలకు పరిశుద్ధమైన మటన్ అందేలా చూసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close