ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి. అతి తక్కువ ఫీజులతో విద్యా సేవ అందిస్తున్నాయి. వీటి వల్ల ప్రభుత్వానికి కూడా భారం తగ్గుతుంది. అయితే ఇప్పుడు వాటిని ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది. వాటికి ఉన్న వేలాది ఎకరాలపై ప్రభుత్వ కన్ను పడిందన్న అనుమానాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే వాటిని ఏమి చేసుకోవడానికైనా హక్కు ప్రభుత్వానికి ఉంటుందని జీవోలోనే ప్రకటించారు.

విజయవాడలోని మాంటిస్సోరి స్కూల్ ను మూసేశారు. ప్రభుత్వానికి అప్పగించడం ఇష్టం లేక అలాగని ప్రైవేటు స్కూల్ తరహాలో నడపలేక మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. అరవై ఏళ్ల చరిత్ర ఉన్న స్కూల్ అది. బాలికల విద్య కోసం శ్రమించిన స్కూల్ అది. అలాంటివి ఏపీ వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్దేశం వాటి స్థలాను లాగేసుకోవడం కాబట్టి అధికారులతో ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఒత్తిళ్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ప్రభుత్వం బెదిరిస్తోందని హైకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.

ఎయిడెడ్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉండటంతో చాలా సంస్థలు ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధపడటం లేదు. ప్రభుత్వ ఎయిడ్ లేకపోవడంతో ఆయా విద్యా సంస్థలు నడవడం కూడా కష్టంగా మారింది. ప్రభుత్వంలోకి తీసుకొనేందుకు అంగీకరించిన విద్యాసంస్థల నుంచి మాత్రమే అంగీకారపు పత్రాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో వేరేగా ఉంది. ఎలా చూసినా ప్రస్తుతం ఎయిడెడ్ వ్యవహారం విద్యార్థులకు కష్టంగా మారింది. ప్రభుత్వంపై విమర్శలు పెరగడానికి కారణం అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close