“స్టాలిన్”ను ఇప్పుడైనా “మిత్రోం సీఎంలు” పట్టించుకుంటారా !?

తమిళనాడు సీఎం స్టాలిన్ అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేక అభిమానం. పలు మార్లు మాటలతో ఈ అభిమానం వ్యక్తమయింది. స్టాలిన్‌కు కూడా అభిమానమే. ఆయన స్వయంగా జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి రావడమే దీనికి నిదర్శనం. అయితే స్టాలిన్‌ను మాత్రం ఈ మిత్రోం ముఖ్యమంత్రులు గౌరవిస్తున్నారో లేదో స్పష్టత లేదు. దక్షిణాది సమస్యలపై కేంద్రంపై పోరాడదామని గతంలో ఓ సారి లేఖ రాస్తే స్పందన లేదు. ఇప్పుడు మరోసారి స్టాలిన్ పోరాటానికి పిలుపునిచ్చారు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని.. కలసి పోరాటం చేద్దాం రావాలని పిలుపునిచ్చారు.

స్టాలిన్ మొత్తం బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న పన్నెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ లేఖలు రాశారు. జాబితాలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఇటీవలి కాలం రాష్ట్రాల హక్కులన్నింటినీ స్వాధీనం చేసుకుంటున్న కేంద్రం వైఖరి స్టాలిన్‌కు నచ్చడం లేదు. విద్యారంగంలో కేంద్రం పెత్తనాన్ని నిలదీద్దామని ఆయన ప్రయత్నిస్తున్నారు. కలసికట్టుగా పోరాడి కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ఆయన లేఖలో పిలుపునిచ్చారు. స్టాలిన్ ఇలా లేఖ రాయడానికి ప్రధానంగా నీట్‌ను కారణంగా చెప్పుకోవచ్చు.

మెడికల్ ఎంట్రన్స్ కోసం దేశవ్యాప్తంగా నీట్ ను ప్రవేశ పెట్టారు. ఈ పరీక్షకు వ్యతిరేకంగా తమిళనాడులో చాలా ఉద్యమాలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థులపై నీట్ ప్రభావాన్ని ఎత్తిచూపారు. దీనిపై ఏకే రాజన్ కమిటీ నివేదిక కాపీని కూడా స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖతో పాటు పంపారు. అంతేకాదు, ఏకే రాజన్ కమిటీ సిఫారసు చేసిన మేరకు తమిళనాడు అసెంబ్లీలో ఆమోదం పొందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ బిల్లు కాపీని కూడా తన లేఖకు జతచేశారు. మరి మిత్రుడు స్టాలిన్ పంపిన లేఖకు కనీసం ప్రత్యుత్తరం అయినా మిత్రులు ఇస్తారో లేదోచూడాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రంపై పోరాడేందుకు ఇప్పటి వరకూ రెండు ప్రభుత్వాలూ ముందుకు రాలేదు మరి. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close