శ్రీవారి సేవలు @ జియో !

ఇటీవల శ్రీవారి దర్శన టిక్కెట్లు జియో మార్ట్‌లో బుక్ చేసుకోవాల్సి రావడంపై భక్తులు ఆశ్చర్యపోయారు. ఇక ముందు అలా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు, గదుల బుకింగ్ మొత్తం జియో ద్వారానే సాగుతుంది. దీనికి వచ్చే వైకుంట ఏకాదశి రోజు నుంచి ముహుర్తం ఖరారు చేశారు. మొత్తం బాధ్యతలన్నీ జియోకు అప్పగిస్తూ శుక్రవారమే ఎంవోయూ చేసుకున్నారు. ఈ ఎంవోయూ ప్రకారం ఇక టీటీడీకి సంబంధించి భక్తులకు అందే సేవలన్నీ జియో యాప్‌లో మాత్రమే లభ్యమవుతాయి. టీటీడీ వెబ్ సైట్‌ అవసరం ఇక ఉండదు.

టీటీడీకి సంబంధించిన అన్ని సేవలు, సమస్త సమాచారం ఒకే చోట లభించేలా జియో సంస్థ ప్రత్యేకంగా యాప్ తయారు చేస్తుంది. ఈ యాప్ లో భక్తులకు అవసరమైన దర్శనం టిక్కెట్లు, రూముల బుకింగ్ వంటి సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం యాప్ పని జరుగుతోంది. టీటీడీ వె‌బ్ సైట్‌కు సాంకేతిక సమస్యలు వస్తూండటంతో జియో యాప్‌తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. దానికి కారణంగా ఇటీవల లక్షల మంది భక్తులు టికెట్ కోసం ప్రయత్నించారని.. దీంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. ఆ సమస్యలు రాకుండా ఉండేందుకే జియోతో ఒప్పందం అని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. నిజానికి అప్పుడు సమస్య వచ్చింది జియో సర్వర్లలోనే. టిక్కెట్ల బుకింగ్ కోసం క్లిక్ చేయాడనికి జియో మార్ట్‌కు రీ డైరక్ట్ అయింది.

గత ఐదేళ్లుగా టీటీడీకి టీసీఎస్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇప్పుడు కూడా టీసీఎస్ సమన్వయంతోనే జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటి విభాగానికి మెరుగైన సేవలు అందిస్తుందని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. రూ. కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ ఉచితంగా ఇస్తున్నారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి . ఉచితంగా ఇవ్వడం అంటే.. టీటీడీకి సర్వర్ల సామర్థ్యం కల్పించి.. శ్రీవారి వెబ్ సైట్నుంచి సేవలు అందించడమే కానీ.. పెద్ద ఎత్తున ప్రచారం పొందేలా జియో యాప్ ద్వారా అందించడం కాదని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని ఎవరూ ప్రశ్నించరాదు. ప్రశ్నిస్తే కేసులు పెడతామనే హెచ్చరికలు తరచూ టీటీడీ వర్గాలు చేస్తూనే ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close