“సెంటు స్థలాలపై” హైకోర్టు తీర్పుపై వైసీపీనే సంతోషపెట్టిందా!?

సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్లేమిటంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అంశాల వారీగా అవ భూములు, మైనింగ్ భూములు, విద్యా సంస్థల భూములు ఇళ్ల స్థలాలకు ఇవ్వవొద్దంటూ కొంత మందికి కోర్టుకు వెళ్లారు కానీ అసలు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని ఎవరు వెళ్లారో ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. కానీ విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి కూడా మానవహక్కులు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందని తేల్చేసి తీర్పు ఇచ్చేశారు. ఈ ప్రకారం ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించిన తర్వాత మాత్రమే ఇళ్లు కట్టాలి. అప్పటి వరకూ ఇళ్ల నిర్మాణం ఆపేయాలి.

హైకోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చిన తర్వాత మొదటగా టీడీపీ నేతలే ఆశ్చర్యపోయారు. సహజంగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలితే వారు ఎగిరి గంతేస్తారు . కానీ ఈతీర్పు వారికీ రుచించలేదు. జగన్ ప్రభుత్వం దగ్గర పైసా లేదని.. కేంద్రం ఇళ్ల కోసం ఇచ్చిన నిధుల్ని కూడా మళ్లించిందని ఇప్పుడు ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని వారు నమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు వారికి హైకోర్టు తీర్పు ఇబ్బందికరంగా మారింది. హైకోర్టు తీర్పు చూపించి ప్రభుత్వం ఇల్లు కట్టడం మానేస్తుంది. ఎవరైనా అడిగితే కోర్టు తీర్పును చూపిస్తుంది.

మామూలుగా ఏదైనా అవసరమైన విషయాల్లో ఇలాంటి తీర్పు వస్తే హుటాహుటిన డివిజనల్ బెంచ్‌కు ప్రభుత్వం వెళ్తుంది. కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్లుగా లేదు. కానీ ఈ తీర్పు ప్రతిపక్షాల కుట్ర అని ప్రచారం చేసేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటోంది. ప్రతిపక్ష నేతలు తమ పలుకుబడి ఉపయోగించి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని మంత్రి బొత్స అనేశారు. దీంతో ఇళ్ల నిర్మాణం విషయంలో ఏదో జరుగుతోందని టీడీపీ నేతలు మేథోమథనం ప్రారంభించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close