వైసీపీ కాదు ప్రజలే దాడి చేశారన్న వైసీపీ, డీజీపీ !

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహంతో ప్రజలే దాడి చేశారని ఆ పార్టీ నేత సుధాకర్ బాబు దాడులు జరుగుతున్న సమయంలోనే ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కావాలని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అచ్చంగా వైసీపీ నేతలు చేసిన ప్రకటన తరహాలోనే డీజీపీ ఆఫీసు నుంచి కూడా ప్రకటన రిలీజయింది. రెచ్చగొట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆవేశాలకు లోను కావొద్దని డీజీపీ ఆఫీసు ప్రకటించింది.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని.. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిది. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని.. ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలని డీజీపీ ఆఫీస్ కోరింది.

టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజలు వచ్చి దాడి చేశారని డీజీపీ కార్యాలయం చెబుతోది. రాష్ట్ర డీజీపీ కార్యాలయం పక్కనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంది. పదుల సంఖ్యలో కార్లలో కర్రలు, రాడ్లతో దుండగులు వచ్చి దాడులు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అంత సేపు దాడులు జరుగుతున్నా పోలీసులు స్పందించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీకి ఫోన్ చేసినా స్పందించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. మొత్తంగా చూస్తే ఏపీలో వైసీపీ నేతలు దాడులు చేస్తే టీడీపీ నేతలు రెచ్చగొట్టినట్లుగా.. టీడీపీ నేతలు నిరసనలు చేపట్టినా చట్టాలు ఉల్లంఘించినట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close