ఓకే.. విష్ణును పవన్ పలకరించారు..! అయితే ఏంటి ?

హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అలయ్ – భలయ్ కార్యక్రమంలో పాల్గొన్న విష్ణును పవన్ కల్యాణ్ పలకరించలేదని మీడియాలో రావడం మంచు టీంకు నచ్చలేదు. నిన్నటి నుంచి అదే పనిగా పవన్ కల్యాణ్‌తో విష్ణు మాట్లాడారని.. చాలా విషయాలు మాట్లాడుకున్నారని పదే పదే చెప్పడం ప్రారంభించారు. మొదట మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. విష్ణుతో పవన్ మాట్లాడారని అప్పుడు మీడియా షూట్ చేయలేదని చెప్పుకొచ్చారు. తర్వాత తిరుపతిలో మీడియా సమావేశంలో విష్ణు కూడా అదే చెప్పారు. స్టేజ్ మీద వెంకయ్యనాయుడు ఉండటంతో ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడుకోలేదన్నారు.

కానీ స్టేజ్ కింద మాత్రం చాలాసేపు మాట్లాడుకున్నామని.. “మా”ను కాపాడాలని పవన్ కోరారని విష్ణు చెప్పుకొచ్చారు. మళ్లీ ఈ రోజు ఇదిగో పవన్ కల్యాణ్ తనతో మాట్లాడారంటూ విష్ణు ఓ వీడియోనుషేర్ చేసుకున్నారు. ఎదురుగా వచ్చినప్పుడు పవన్ – విష్ణు ఆలింగనం చేసుకున్నారు. తర్వాత కాసేపు ముచ్చటించుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాట్లాడలేదని మీడియాలో వచ్చిందని ఎందుకు విష్ణు అంత ఇబ్బందిగా ఫీలయ్యారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

పవన్ కల్యాణ్ ఎవరినీ ఎవాయిడ్ చేయలేదు. సెట్‌కు వస్తానంటే మంచు మనోజ్‌కు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆయనేమీ మా ఎన్నికల్లో నేరుగా ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేయలేదు. విష్ణు టీంపై ఎప్పుడూ వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అయినా కానీ తమను పవన్ పలకరించలేదని మీడియాలో .. సోషల్ మీడియాలో వచ్చిందని .. కానీ ఆయన పలకరించాలని అదే పనిగా నిరూపించుకునేందుకు మంచు టీం ప్రయత్నించడమే .. కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close