మోహన్‌బాబును అరెస్ట్ చేయాలని పదుల సంఖ్యలో ఫిర్యాదులు !

మంచు మోహన్ బాబుపై పలికిన ఓ డైలాగ్ వివాదాస్పదమయింది. ఆయనపై రెండు తెలుగు రాష్ట్రాల సంఖ్యలో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. మొదట అనంతపురం జిల్లాలో ఓ యాదవ సంఘం నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు తమనుకించ పరిచారని.. తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ” సినిమా ఎన్నికల్లో ఏమిటీ గొడవలు.. ఏమిటి బీభత్సం.. ఏంటి ఘర్షణలు.. ప్రజలందరూ చూస్తున్నారు.. గొర్రెలు, మేకలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది.. అతను కూడా ఇక్కడ జరిగిందంతా చూస్తున్నాడు.

అతనికి కూడా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందని.. ” అని మోహన్ బాబు అన్నారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తమ వృత్తిని అవమానించేలా ఉన్నాయని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీలో ఫిర్యాదులు ప్రారంభమైనా.. తెలంగాణలో మాత్రం జోరందుకున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లో తమను కించపరిచేలా మాట్లాడిన సినీనటుడు మంచు మోహన్‌బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు ఫిర్యాదు చేశారు.

తక్షణం మోహన్‌బాబు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతూండటంతో మోహన్ బాబు కూడా స్పందించే అవకాశం ఉంది. ఆయన క్షమాపణలు చెప్పి వివాదాన్ని ముగిస్తారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close