ఏపీని కించపర్చి కేసీఆర్ జగన్‌కు మేలు చేస్తున్నారా ? కీడా ?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఏపీని కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల పరంగా ఎలా ఉన్నా.. రాజకీయంగా మాత్రం ఆత్మీయుడు, మిత్రుడు అయిన జగన్ సీఎంగా ఉన్నా కేసీఆర్ ఎందుకు ఆంధ్రా గురించి తక్కువగా మాట్లాడుతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో మూడు రాజధానులను కేసీఆర్, కేటీఆర్ సమర్థించారు. ఏపీలో పాలన బాగా సాగుతుందనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీలో చీకట్లు అలుముకున్నాయని.. నాశనం అయిపోయిందని.. కానీ తెలంగాణ మాత్రం బంగారుమయం అయిందన్నట్లుగా చెబుతున్నారు. పైగా ” ఏపీలోనూ టీఆర్ఎస్‌ను పోటీ చేయమని అంటున్నారని.. గెలిపించుకుంటామని చెబుతున్నారని ” అంటున్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు.. తాము ఏపీకీ ఎందుకు వెళ్లకూడదని.. తాము ఏపీ రాజకీయాల్లో ఎందుకు వేలు పెట్టకూడదని కేటీఆర్ ప్రశ్నించడమే కాకుండా..వేలు కూడా పెట్టారు. వైసీపీకి బహిరంగ మద్దతు పలికారు.

ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రభుత్వానికి టీఆర్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉంది. గతంలో చంద్రబాబు హయాంలోనే .. ఏపీలోని అంశాలకు తెలంగాణలో కేసులు పెట్టి చేయాల్సిన రచ్చ అంతా చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఏపీని ఎందుకు తక్కువ చేస్తున్నారన్నది రాజకీయవర్గాలకూ అంతు బట్టకుండా ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు కూడా . అందుకే కేసీఆర్ విమర్శలపై ఎవరూ ఎక్కువగా స్పందించవద్దని వైసీపీ హైకమాండ్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురు గాలులు వీస్తున్నాయని.. ఈ కారణంగా మళ్లీ ఏపీని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం వల్లనే తెలంగాణ బాగు పడిందని. .ఏపీ చెడిపోయిందని చెప్పాలనుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close